Nagarjuna: రెండేళ్ల తర్వాత రావడం ఆనందంగా ఉంది: నాగార్జున

సుమారు రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. తాజాగా ఆయన తన సతీమణి అమలతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు....

Published : 21 Jan 2022 13:23 IST

తిరుమల: సుమారు రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. తాజాగా ఆయన తన సతీమణి అమలతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి సేవలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి స్వామి వారి దర్శనానికి రాలేకపోయాను. నూతన సంవత్సరంలో స్వామి సేవలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ ఏడాది అందరికీ మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అని ఆయన తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆయన కథానాయకుడిగా నటించిన ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో నాగార్జున, నాగచైతన్య స్క్రీన్‌ పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని