నగ్మాకు కరోనా

అలనాటి హీరోయిన్‌, నేటి రాజకీయ నాయకురాలు నగ్మా కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్‌ 3న

Published : 08 Apr 2021 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలనాటి హీరోయిన్‌, రాజకీయ నాయకురాలు నగ్మా కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్‌ 3న కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారామె. తర్వాత కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉంటున్నానని తెలిపారు. అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని, టీకా తీసుకున్నా కరోనా సోకితే కంగారు పడాల్సిందేమీ లేదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్విటర్ ద్వారా కోరారు. నగ్మా 1990లో వచ్చిన హిందీ సినిమా ‘భాఘీ’ ద్వారా పరిచయం అయ్యారు. హీరోయిన్‌గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లోని పలు చిత్రాల్లో నటించిన ఆమె 2008లో సినిమాలకు స్వస్తి చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని