Namrata: తను ఇంటికి తిరిగి వచ్చే వరకూ దిగులుగానే ఉంటుంది : నమ్రత

తన పిల్లలు గౌతమ్‌ (Gautham), సితార (Sitara)ల గురించి తరచూ పోస్టులు పెడుతుంటారు మహేశ్‌బాబు(Mahesh Babu) సతీమణి నమ్రత (Namrata). తాజాగా ఆమె ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. వారం రోజులపాటు గౌతమ్‌ టూర్‌కు వెళ్తున్నాడని పేర్కొన్న ఆమె..  తనకెంతో బాధగా ఉన్నట్లు చెప్పారు. 

Updated : 21 Jan 2023 10:37 IST

హైదరాబాద్‌: తన తనయుడు గౌతమ్ ‌(Gautham)ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు నటుడు మహేశ్‌బాబు (MaheshBabu) సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar‌). కల్చరల్‌ టూర్‌లో భాగంగా గౌతమ్‌ తొలిసారి సొంతంగా ప్రయాణం చేస్తున్నాడని పేర్కొన్న ఆమె.. తనకెంతో బాధగా ఉందని చెప్పారు. తన కుమారుడు తిరిగి వచ్చేవరకూ వెలితిగానే ఉంటుందని పేర్కొన్నారు.

‘‘కల్చరల్‌ ట్రిప్‌లో భాగంగా గౌతమ్‌ ‌(Gautham) మొదటిసారి.. సొంతంగా విదేశాలకు వెళ్లాడు. నాలోని ఓ భాగం నన్ను వదిలి వెళ్లినట్లు అనిపించింది. రోజంతా శూన్యంగా గడిచింది. తను ఇంటికి తిరిగి వచ్చి.. మా కళ్ల ముందు ఉండే వరకూ ఈ బాధ పోదు. గూడును వదిలి మా బాబు ఎగరగలుగుతున్నాడు. ఈ వారం మొత్తం సరదాలు, సంతోషాలు, సాహసాలతో గడవాలని ముఖ్యంగా ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు మరింత తెలుసుకోవాలని ఆశిస్తున్నా. ఈ ప్రయాణం నీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాగే నీ రాక కోసం ఎదురుచూస్తుంటా’’ అని నమ్రత (Namrata) పేర్కొన్నారు. #Teens #Independence అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను ఆమె ఈ పోస్టుకు జత చేశారు. అలాగే, సహ విద్యార్థులతో కలిసి గౌతమ్‌ దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని