Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’ ఫ్రైడే నైట్‌ పార్టీ.. ఫొటోలు వైరల్‌

బ్యాంకింగ్‌ వ్యవస్థ.. ఈఎంఐల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను తెలియజేస్తూ తెరకెక్కిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారువారి పాట’...

Updated : 14 May 2022 12:58 IST

హైదరాబాద్‌: బ్యాంకింగ్‌ వ్యవస్థ.. ఈఎంఐల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను తెలియజేస్తూ తెరకెక్కిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారువారి పాట’. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. మే 12న విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ చిత్రబృందానికి స్పెషల్‌ పార్టీ ఇచ్చింది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో శుక్రవారం రాత్రి ఈ పార్టీ జరిగింది. ఇందులో మహేశ్‌బాబు నమ్రత దంపతులు, పరశురామ్‌ దంపతులు, సుకుమార్‌, బుచ్చిబాబు, హరీశ్‌శంకర్‌, దిల్‌రాజు, శిరీష్‌.. తదితరులు పాల్గొన్నారు. ‘సర్కారువారిపాట’ సక్సెస్‌ పార్టీ ఎంతో సరదాగా సాగిందంటూ నమ్రత ఫొటోలు షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ కథానాయిక. సముద్రఖని, నదియా, తనికెళ్లభరణి కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని