Balakrishna: థియేటర్‌లో సినిమా చూస్తే వచ్చే మజానే వేరు: బాలకృష్ణ

ఏ సినిమానైనా థియేటర్‌కు వచ్చి చూస్తేనే మజా ఉంటుందని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) అన్నారు.

Updated : 20 Jan 2022 21:38 IST

హైదరాబాద్‌: ఏ సినిమానైనా థియేటర్‌కు వచ్చి చూస్తేనే మజా ఉంటుందని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. ఆయన కీలక పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘అఖండ’ (Akhanda). ప్రగ్యాజైశ్వాల్‌ కథానాయిక. గతేడాది డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌కు విచ్చేసిన బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సమరసింహారెడ్డి’ తరువాత సుదర్శన్ థియేటర్‌కు వచ్చా. ‘అఖండ’ మూవీ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. లక్షల మంది అభిమానులను సంపాదించుకోవడం గర్వంగా ఉంది. ఈ విజయం తెలుగు చలన చిత్ర విజయం. ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో ‘అఖండ’ చూస్తే అర్థమవుతుంది. ప్రగ్యా జైశ్వాల్‌ అద్భుతంగా నటించింది. సినిమా విడుదలకు ముందే ‘అఖండ’ గురించి మాట్లాడుకున్నారు. సినిమాను థియేటర్‌కు వచ్చి చూస్తేనే మజా. జనవరి 21వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ‘అఖండ’ స్ట్రీమింగ్‌ కానుంది. అక్కడ కూడా సినిమాను ఆదరించాలి’’ అని అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘అఖండ’ వందకు పైగా సెంటర్లలో 50 రోజులు ఆడటం ఒక సంచలనం. ఈ విజయం నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులది. ఈ విజయాన్ని భగవంతుడికి, స్వర్గీయ ఎన్టీఆర్‌కి అంకితం ఇస్తున్నాం. శుక్రవారం నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ‘అఖండ’ వస్తుంది’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు