Balakrishna: ఆ వార్త నన్నెంతో కలచివేసింది: బాలకృష్ణ

సీనియర్‌ నటుడు మన్నవ బాలయ్య మృతిపట్ల నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం సోషల్‌మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు...

Published : 09 Apr 2022 12:29 IST

బాలయ్య మృతిపట్ల నటుడి సంతాపం 

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు మన్నవ బాలయ్య మృతిపట్ల నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం సోషల్‌మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సీనియర్‌ నటుడు మన్నవ బాలయ్య గారి మరణ వార్త నన్నెంతో కలచివేసింది. ఆయన అద్భుతమైన నటుడు. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడు, కథారచయితగా బాలయ్య తన ప్రతిభ చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని బాలకృష్ణ తెలిపారు. బాలకృష్ణ నటించిన ‘శ్రీరామరాజ్యం’, ‘మిత్రుడు’ చిత్రాల్లో బాలయ్య కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని