Dhee 14: కన్నీటి పర్యంతమైన నందితా, ప్రదీప్‌.. భావోద్వేగంగా ‘ఢీ’

ఎప్పుడూ డ్యాన్సులు, నవ్వులతో సందడిగా ఉండే ‘ఢీ 14’ వేదికపై భావోద్వేగం చోటుచేసుకుంది. తమను పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను భారంగా భావించే వారికి కునువిప్పు కలిగేలా ఓ స్కిట్‌ ఈ షోలో ప్రదర్శితమైంది.

Published : 15 May 2022 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడూ డ్యాన్సులు, నవ్వులతో సందడిగా ఉండే ‘ఢీ 14’ వేదికపై భావోద్వేగం చోటుచేసుకుంది. తమను పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను భారంగా భావించే వారికి కునువిప్పు కలిగేలా ఓ స్కిట్‌ ఈ షోలో ప్రదర్శితమైంది. ఈ నేపథ్యంలో తన తండ్రిని తలచుకుని న్యాయనిర్ణీతల్లో ఒకరైన నందితా శ్వేత కంటతడి పెట్టుకుంది. ఇటీవల మరణించిన తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైంది. మరోవైపు, తన తండ్రిని తలచుకుని కార్యక్రమ వ్యాఖ్యాత ప్రదీప్‌ ఎమోషన్‌ అయ్యారు. అనంతరం, టీమ్‌ లీడర్లు హైపర్‌ ఆది, రవి అలనాటి హీరోలను తలపించేలా రెడీ అయి, తమదైన శైలిలో కామెడీ పండించారు. ‘డీజే టిల్లు’ పాటకు డ్యాన్స్‌ చేసి అలరించారు. ‘నీలి నీలి ఆకాశం’ పాటను విచారంగా ఆలపించిన ఆది అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఈ ఫన్‌ అండ్‌ ఎమోషన్‌ ఎపిసోడ్‌ ‘ఈటీవీ’లో బుధవారం రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని