‘కలర్ ఫోటో’ చిట్టిముత్యం.. ఎవరైనా కాదంటే..?
‘కలర్ ఫొటో’ చిత్ర బృందంపై నాని, ఎస్.ఎస్. కార్తికేయ ప్రశంసలు కురిపించారు. చక్కటి కథాంశంతో చిత్రాన్ని రూపొందించారంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. సుహాస్, చాందిని, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. సందీప్ రాజ్...
హైదరాబాద్: ‘కలర్ ఫోటో’ చిత్ర బృందంపై నాని, ఎస్.ఎస్. కార్తికేయ ప్రశంసలు కురిపించారు. చక్కటి కథాంశంతో చిత్రాన్ని రూపొందించారంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. సుహాస్, చాందిని, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. కాల భైరవ సంగీతం సమకూర్చారు. అక్టోబరు 23న ఓటీటీ వేదికగా ఆహాలో చిత్రం విడుదలైంది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభించింది. దీన్ని చూసిన నాని ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ చిత్రం నాకెంతో నచ్చింది. చిట్టి ముత్యం ఈ సినిమా. కాదని ఎవరన్నా అంటే..’ అని ట్వీట్ చేశారు.
‘‘కలర్ ఫోటో’లోని ప్రతి సన్నివేశం నాకు వినోదం పంచింది. సుహాస్ ప్రతి ఫ్రేమ్లో నచ్చాడు. అతడికి నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉంది. సందీప్ రాజ్ సినిమా చాలా బాగా రాసి, తీశావు. కాన్సెప్ట్ నాకెంతో నచ్చింది. సునీల్ గారు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అదరగొట్టేశారు సర్. మా తమ్ముడని కాదు కానీ, నేపథ్య సంగీతం, పాటలతో కాల భైరవ సినిమాకు ప్రాణం పోశాడు. ‘కలర్ ఫోటో’ సినిమా చూడండి..’ అని కార్తికేయ ట్వీట్లు చేశాడు.
‘‘కలర్ ఫోటో’పై పాజిటివ్ కామెంట్లు చాలా విన్నా. సంతోషంగా ఉంది. మొత్తం చిత్ర బృందానికి కుడోస్’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’