మన నంబర్‌ పెరగడం సంతోషంగా ఉంది: నాని

జాతీయ అవార్డుల విషయంలో మన తెలుగు పరిశ్రమకు సంఖ్య పెరుగుతుండటం సంతోషంగా ఉందని కథానాయకుడు నాని అన్నారు. 2019కి సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సోమవారం ప్రకటించింది.

Published : 22 Mar 2021 22:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జాతీయ అవార్డుల విషయంలో మన తెలుగు పరిశ్రమకు సంఖ్య పెరుగుతుండటం సంతోషంగా ఉందని కథానాయకుడు నాని అన్నారు. 2019కి సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సోమవారం ప్రకటించింది. అందులో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రానికి చోటు దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నాని స్పందించారు. ‘‘ఈ మధ్య నేను గౌతమ్‌ను కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ.. ‘పాపం జెర్సీకి ఇక అవార్డులు గెలవడానికి అవకాశం లేదు. కరోనా వల్ల అవార్డులన్నీ మిస్‌ అయినట్టే అనుకున్నాం.’ కానీ, ఇప్పుడు అవార్డులు ప్రకటించారు. జెర్సీకి రెండు అవార్డులు వచ్చాయి. ఈ వార్త మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా టీమ్‌ మొత్తానికి శుభాకాంక్షలు. ముందుగా గౌతమ్‌కు. ఎడిటింగ్‌లో అవార్డు గెలుచుకున్న నవీన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. జెర్సీతో పాటు అవార్డులు గెలుచుకున్న ‘మహర్షి’కి కంగ్రాట్స్. ప్రతి సంవత్సరం జాతీయ అవార్డుల విషయంలో మన తెలుగు సినిమాల నంబర్‌ పెరగడం సంతోషంగా ఉంది’’ అని నాని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని