Shyam Singha Roy: సినిమా బాగుందని ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు!
‘‘సినిమా బాగుందని ఒకటి రెండు లైన్లలో చెప్పడం లేదు. ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తోంది’’ అన్నారు కథానాయకుడు నాని. ఆయన నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
‘‘సినిమా బాగుందని ఒకటి రెండు లైన్లలో చెప్పడం లేదు. ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తోంది’’ అన్నారు కథానాయకుడు నాని. ఆయన నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. సోమవారం హైదరాబాద్లో విజయోత్సవ వేడుకని నిర్వహించింది చిత్రబృందం. నాని మాట్లాడుతూ ‘‘ఎలాంటి పరిస్థితులు ఉన్నా మంచి చిత్రాలను ఆదరిస్తామని ప్రేక్షకులు ప్రతిసారీ నిరూపిస్తూనే ఉన్నారు. వరుస విజయాలతో ఈనెల అంతా బాగుంది. అన్ని పరిస్థితులు చక్కబడి ఈ ఊపు ఇలాగే మరో పదేళ్లు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ‘సఖి’లాంటి ఎప్పటికీ నిలిచిపోయే లవ్స్టోరీ చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడీ చిత్రంతో ఆ కోరిక తీరింది. తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఈ న్యూ ఇయర్ కూడా మనదే’’ అన్నారు. ‘‘రాహుల్ రెండో చిత్ర దర్శకుడైనా ఓ సున్నితమైన అంశాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రం చేసేటప్పుడు నిర్మాత వెంకట్ బోయనపల్లి.. ‘ఓ హిట్టు సినిమా ఎలా తీయాల’ని నన్నడిగారు. ఈరోజు ఆయన దగ్గరకి నాని ఓ హిట్టును నడిపించుకుని తీసుకొచ్చారు. నాని, సాయిపల్లవిల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లకు ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోతారు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్కు వస్తారారా అనుకుంటున్న తరుణంలో.. ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్ సింగరాయ్’తో వరుస హిట్లు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర విడుదల సమయంలో నాని మాట్లాడిన ఓ విషయాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజానికి తను చెప్పిన ఫీలింగ్ వేరు. ఆయన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్ద’’న్నారు నిర్మాత దిల్రాజు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ ‘‘అందరం కలిసి రాయి రాయి పేర్చి ఈ చిత్రాన్ని ఓ గుడిలా కట్టాం. ఈరోజు మాకు దక్కిన విజయం మాది కాదు. ప్రేక్షకులకు ఉన్న అభిరుచి వల్లే ఇలాంటి చిత్రాలు ఆడుతున్నాయి. వాళ్లకి కథ.. కథనం.. కవిత్వం.. సంగీతం.. ప్రతిదానిపైనా మంచి అభిరుచి ఉంది. అందుకే థియేటర్కు వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నా జీవితంలో ముగ్గురు శ్యామ్ సింగరాయ్లు ఉన్నారు. అందులో ఒకరు మా నాన్న. పుస్తకాల్ని.. కమ్యునిజాన్ని పరిచయం చేసింది ఆయనే. సినిమాలో శ్యామ్ బావి దగ్గర మాట్లాడా సీన్ ఒకటుంటుంది. అది నాన్న అనుభవాల నుంచి రాసుకున్నదే. నాకు రెండో శ్యామ్ సింగరాయ్ సిరివెన్నెల గారు. మీరు నాకెంతో స్పెషల్ సర్. ఇక నా మూడో శ్యామ్ సింగరాయ్.. రియల్ సింగరాయ్ నాని గారు. ఆయన వల్లే ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చింది. మీరు లేకపోతే ఈ చిత్రం లేదు’’ అన్నారు.
* సాయిపల్లవి మాట్లాడుతూ ‘‘ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం దర్శకుడు రాహుల్. చిత్రాన్ని ఎంతో కవితాత్మకంగా చూపించారు. సాను మంచి విజువల్స్ ఇచ్చారు. నీరజ అద్భుతమైన కాస్ట్యూమ్స్ ఇచ్చింది. కీర్తి పాత్రలో కృతి ఎంతో చక్కగా ఒదిగిపోయింది. నటన పట్ల నానికి ఉన్న నిబద్ధత నాకు చాలా నచ్చింది. ఇప్పటికీ ప్రతి సినిమాకీ తొలి చిత్రమన్నట్లుగానే కష్టపడుతుంటార’’ంది. ‘‘సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చినంత ప్రేమ ఇంకెవరూ ఇవ్వలేరు. ఇంత మంచి చిత్రంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాని నటన చూశాక.. నటిగా మరింత స్ఫూర్తి పొందా. సాయిపల్లవి అద్భుతంగా నటించారు. ఇంత మంచి కథ అందించిన సత్యదేవ్ జంగాకు, నాకీ అవకాశమిచ్చినందుకు దర్శకుడు రాహుల్కు కృతజ్ఞతలు’’ అంది కృతి శెట్టి. నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు తలవంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా విషయంలో నాకెంతో సహాయం చేసిన దిల్రాజు, శిరీష్కు థ్యాంక్స్. కొవిడ్ సమయంలో చిత్ర బృందం ఎంతో కష్టపడి పని చేసి చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ సినిమా కోసం సాయిపల్లవిని చాలా శ్రమ పెట్టాం. కృతి బాగా చేసింది. రాహుల్ సంకృత్యాన్ వల్లే ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చింది. ఆఖరిగా నానికి నేను చెప్పగలిగింది ఒకటే.. థ్యాంక్స్ సర్’’ అన్నారు. కార్యక్రమంలో ఆర్.నారాయణమూర్తి, అభినవ్ గోమటం, కె.అవినాష్, సత్యదేవ్ జంగా, నీరజ కోన తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత