MAA Elections: ప్రకాశ్రాజ్, నాగబాబులకు నరేశ్ కౌంటర్.. విష్ణుకు ఆ అవసరం లేదు!
మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని సినీ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ అన్నారు.
హైదరాబాద్: మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని సినీ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణుతో సహా ఆయన ప్యానెల్ సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ‘మా’ బయట ఉండి తాము విష్ణు చేసే పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్ కార్డు అడుగుతామని గతంలో ప్రకాశ్రాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ‘మా’ మసకబారిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలకూ నరేశ్ ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు.
‘‘పోటీలో గెలిచిన వాళ్లందరికీ శుభాకాంక్షలు. ‘మంచు కమిటీ.. మంచి కమిటి’. ఎందుకంటే ఈ కమిటీలో అనుభవం కలిగిన వాళ్లు, యువత, మహిళలు ఉన్నారు. అవకాశాల కోసం పోరాడతామని చెప్పారు. మంచి మేనిఫెస్టోతో వచ్చారు. అదే మన పనికి అద్దం పడుతుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్గారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసే ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ అయిపోయిందేదో అయిపోయింది. భవిష్యత్ కోసం పనిచేద్దాం. ‘మా’ మెరుగు పడాలని ఆరేళ్లు పోరాటం చేశా. ‘మా’ సభ్యులకు అన్ని రకాలుగా సహాయం చేశా. ‘మా’ ఏ ఒక్కరి సొత్తు కాదు. ‘మా’ చిన్నదా? పెద్దదా అనేది కూడా విషయం కాదు. ఎందుకంటే కోహినూరు వజ్రం చిన్నదే. కానీ, అది వజ్రమే. ఈ కమిటీ కచ్చితంగా అద్భుతాలను సాధిస్తుందని నమ్ముతున్నా. ‘మా’ మెరుగు పడింది. మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈ క్షణం నుంచి ‘మంచి మాత్రమే మైకులో మాట్లాడదాం. చెడు చెవిలో చెప్పుకుందాం’’
‘‘మా’ పదవులు భుజకీర్తులు కావు. ‘మా’ బాధ్యత. ఒక సభ్యుడిగా ‘మా’ని అంటిపెట్టుకుని ఉంటా. అధ్యక్షుడంటే అందరి మన్ననలు పొందాలి. విష్ణు 106 ఓట్ల మెజార్టీతో గతంలో నేను సాధించిన మెజార్టీ కన్నా ఎక్కువ సంపాదించాడు. దానర్థం సభ్యులకు విష్ణుపైనా, ఆయన వెనకున్న వారిపైనా(మోహన్బాబును చూపిస్తూ..) ఉన్న నమ్మకం. ఇందులో ఏమాత్రం రాజకీయం లేదు. ఈ కమిటీ అవకాశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఎవరికీ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెబ్సైట్లో ఉంటుంది. చూసుకోవచ్చు. మహిళలు, యువత కోసం విష్ణు కమిటీ పనిచేస్తుంది. హెల్ప్లైన్ కూడా నిరంతరం పనిచేస్తుంది. ఏమైనా ఫిర్యాదులు తప్పకుండా పరిష్కరిస్తాం. ఎటువంటి సమస్య ఉన్నా, మీరు నాకు ఫోన్ చేయొచ్చు. విష్ణుకు, ‘మా’కు అన్నయ్య ఉంటా. వేగంగా పని జరగాలనే ఉద్దేశంతోనే మొన్న విష్ణుకు బాధ్యతలు అప్పగించి, ఈరోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశాం. విష్ణు బాధ్యతలు స్వీకరించిన రోజున నేను కన్నీళ్లతో బయటకు వస్తుంటే, ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. అవి ఆనందబాష్పాలు. ఆరేళ్ల పనికి ఒక మంచి భవిష్యత్ కనపడిందని సంతోషపడ్డా. పదవుల కోసం నేనెప్పుడూ ఉండను. బాధ్యతల కోసం ఉంటాను. అందరికీ నేను న్యాయం చేయలేకపోవచ్చు. నా తుది శ్వాస వరకూ ‘మా’కోసం పనిచేస్తా’’ అని నరేశ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు