Allari Naresh: మరో చిత్రానికి నాంది

కథానాయకుడు అల్లరి నరేష్‌ - దర్శకుడు విజయ్‌ కనకమేడల కలయికలో వచ్చిన ‘నాంది’ ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించనున్న ఆ చిత్రాన్ని

Updated : 28 Jun 2022 14:01 IST

కథానాయకుడు అల్లరి నరేష్‌ - దర్శకుడు విజయ్‌ కనకమేడల కలయికలో వచ్చిన ‘నాంది’ ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించనున్న ఆ చిత్రాన్ని సోమవారం ప్రకటించారు. ‘‘కొత్తతరం యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. విజయ్‌ కనకమేడల శక్తిమంతమైన, విలక్షణమైన కథని సిద్ధం చేశారు. అల్లరి నరేష్‌ మరోసారి గాఢతతో కూడిన పాత్రలో కనిపించనున్నార’’ని  చిత్రవర్గాలు స్పష్టం చేశాయి. నరేష్‌ ప్రస్తుతం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’లో చేస్తున్నారు. అది పూర్తయ్యాక కొత్త చిత్రం ప్రారంభం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని