మెగాస్టార్కి తెగ నచ్చింది: నాట్యం హీరోయిన్ సంధ్యారాజు
ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి సంధ్యారాజు నటిస్తూ నిర్మించిన ‘నాట్యం’ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన ‘నాట్యం’ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకి మంచి స్పందన లభించింది. టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకొంది. ‘నాట్యం’ విడుదల సందర్భంగా హీరోయిన్ సంధ్యారాజు పంచుకున్న సినిమా కబుర్లు మీకోసం..
శ్వాస, ధ్యాస..నాట్యమే
చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ప్రాణం. నా ఆలోచనలెప్పుడూ దాని చుట్టూనే తిరుగుతాయి. నాట్య ప్రదర్శనలు చేస్తే అభిరుచి ఉన్న కొద్దిమంది మాత్రమే చూస్తారు. సినిమా ద్వారా ఎక్కువమందికి చేరువుతుందనే ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టాను. సినిమా ప్రపంచం పెద్దగా పరిచయం లేదు. నా ధ్యాస ఎప్పుడూ నాట్యం మీదే ఉండేది. నాట్యమే ప్రధానంగా కె. విశ్వనాథ్ లాంటి దర్శకులు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు మాత్రమే కదపడం కాదు. ఓ కథను చెప్పచ్చొనేది మా చిత్రంలో కనిపిస్తుంది. ‘నాట్యం’లో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల అనుబంధం, క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపించే ప్రయత్నం చేశాం. ఇందులో సితార నాట్యకళాకారిణిగా కనిపిస్తాను. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్కు మధ్య ఉండే తేడా ఏంటి? ఇలా రెండు మూడు అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. కమర్షియల్ సినిమాలా భారీగా రూపొందించాం.
మెగాస్టార్కి తెగ నచ్చింది
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినిమా చూసి అభినందించారు. ఐదు నిమిషాలే చూస్తానని చెప్పి, సినిమా పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాని ఇంకా చూడలేదు. సినీ నేపథ్యం నుంచి కాకుండా.. వ్యాపార రంగం నుంచి వచ్చి సినిమా నిర్మాణం చేపట్టడాన్ని ఆయన మెచ్చుకున్నారు. టీజర్ మెగాస్టార్కి బాగా నచ్చింది. పదేళ్లప్పుడు వెంపటి చినసత్యం గారి శిక్షణ కోసం వెళ్లి అక్కడే ఉండిపోయాను. నా జీవితాన్ని కళలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లోవారు కుటుంబ వ్యాపారాన్ని చూసుకోమనేవారు. నా మనసు నాట్యం మీదే ఉండిపోయింది. నా ఆసక్తిని గమనించి కుటుంబసభ్యులిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. పెళ్లయ్యాక మెట్టింట్లోనూ నాకు అండగా నిలిచారు.
ఆదరిస్తే మరిన్ని చిత్రాలు
క్లాసికల్ డ్యాన్స్ తెలియని వాళ్లకీ ఆసక్తి కలిగే విధంగా సినిమాను రూపొందించాం. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిర్మాతగా, నటిగా వ్యవహరించడం కష్టమైన పని. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ పనిచేశాను. షూటింగ్ పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయడం చాలా కష్టం. నాట్య ప్రదర్శనలను మెచ్చుకుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అలాగే ఈ సినిమాను ఆదరిస్తే.. ఇలాంటివి మరిన్ని చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.
ఆ మాటలే ధైర్యాన్నిచ్చాయి
మొదట నాట్యంని ఒక లఘుచిత్రంగా తీశాం. దానికి మంచి ఆదరణ లభించింది. చాలామంది అభినందించారు. షార్ట్ ఫిల్మ్ వల్ల మా జీవితాలు మారిపోయాయనే స్పందన విని కదిలిపోయాను. అప్పుడే ఈ సినిమా చేయడానికి ధైర్యం వచ్చింది. నాట్య ప్రదర్శన ఇవ్వడానికి, కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉంది. కథ, పాత్ర, మాటలు అర్థం చేసుకుని నటించాలి. కెమెరా కేవలం మన ముఖాలనే కాదు, మనలోని భావాలను కూడా పట్టేస్తుంది. ఆ శక్తి కెమెరాకు ఉంది.
కమర్షియల్ సినిమాలు చేయను
మలయాళంలో ‘యూటర్న్’ సినిమా చేశాను. అంతగా ఆడలేదు. వేరే సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేస్తాను. కానీ కమర్షియల్ చిత్రాలు మాత్రం అంగీకరించను. మంచి కథ, పాత్రలకే తొలి ప్రాధాన్యం. జాతీయ అవార్డు సాధించే సత్తా ఉన్న పాత్రలు వస్తే చేయాలని ఉంది. మహిళా ప్రాధాన్య చిత్రాలు చేయాడానికే మొగ్గుచూపిస్తాను. సినిమా పరిశ్రమ గురించి బయట ఏవేవో అంటారు. ఇక్కడ రాజకీయాలు ఎక్కువని చెబుతారు. కానీ చాలా మంచి వారున్నారు. మంచి కంటెంట్తో వస్తే ఆదరిస్తారు. అగ్రహీరోలు చిన్నవాళ్లను ప్రోత్సహిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ మాకోసం సమయం కేటాయించడంతో జీవితమే మారిపోయింది. మా గురువు వెంపటి చినసత్యం గారు చేసినట్టు చేస్తే చాలని అంటున్నారు. కానీ ఆ తరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయనలా చేశారు. ఈ తరానికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి