Nayanthara O2: ఆక్సిజన్‌ కోసం ప్రాణాలను తీసేస్తే..!

‘తన బిడ్డకు ఆపద వస్తే ఏ తల్లీ కూడా చూస్తూ ఊరుకోదు’ అంటున్నారు అగ్ర కథానాయిక నయనతార.

Published : 07 Jun 2022 02:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘తన బిడ్డకు ఆపద వస్తే ఏ తల్లీ కూడా చూస్తూ ఊరుకోదు’ అంటున్నారు అగ్ర కథానాయిక నయనతార. ఆమె కీలక పాత్రలో జీఎస్‌ విఘ్నేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘O2’(ఆక్సిజన్‌). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో జూన్‌ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర తమిళ ట్రైలర్‌ను విడుదల చేశారు. కొడుకుతో కలిసి నయనతార ప్రయాణం చేస్తున్న బస్సు అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటుంది. కొండచరియలు విరిగి పడటంతో బస్సు పూర్తిగా భూమిలోపల కూరుకుపోతుంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించదు. పైగా ఆక్సిజన్‌ కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ బస్సులోని వారు ఏం చేశారు? ఆక్సిజన్‌ కోసం ఒకరి ప్రాణాలను మరొకరు ఎలా తీశారు? చుట్టూ ఉన్న వారి నుంచి నయనతార తన కొడుకుని ఎలా కాపాడుకుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని