Nayan Vignesh-Vijay Ananya: ఇక్కడ విఘ్నేశ్‌-నయన్‌.. అక్కడ విజయ్‌-అనన్య

షూటింగ్స్‌ నుంచి ఏ కాస్త విరామం దొరికినా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటారు మన స్టార్‌ జోడీలు. ప్రియమైన వారు, ఫ్రెండ్స్‌తో డిన్నర్‌ డేట్స్‌.. షాపింగ్స్‌తో సమయాన్ని గడుపుతుంటారు...

Published : 25 May 2022 10:44 IST

లోకల్‌ రెస్టారెంట్స్‌లో తారల విందు..

ఇంటర్నెట్‌డెస్క్‌: షూటింగ్స్‌ నుంచి ఏ కాస్త విరామం దొరికినా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటారు మన తారలు. ఇష్టమైన వారితో కలిసి డిన్నర్‌ డేట్స్‌.. షాపింగ్స్‌తో సమయాన్ని గడుపుతుంటారు. ప్రస్తుతం మన స్టార్‌ కపుల్స్‌ నయనతార-విఘ్నేశ్‌ శివన్‌, విజయ్‌ దేవరకొండ-అనన్యపాండే.. ఫ్రీ టైమ్‌ని సరదాగా గడుపుతున్నారు. డిన్నర్‌ డేట్స్‌కు వెళ్లి తమకిష్టమైన ఫుడ్‌ని రుచి చూశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి.

నయన్‌-విఘ్నేశ్‌@మహాబలిపురం

‘‘బెస్ట్‌ లోకల్‌ ఫుడ్‌ని నాకెంతో ఇష్టమైన నయన్‌కు తినిపించడంలో వచ్చే ఆనందం మరో స్థాయిలో ఉంటుంది’’ అని అంటున్నారు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌. గత కొన్నిరోజుల నుంచి ‘కాతువక్కల రెందు కాదల్‌’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ జంట వర్క్‌ లైఫ్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకుంది. తమకిష్టమైన సీఫుడ్‌ కోసం మహాబలిపురంలోని ‘మూన్‌రేకర్స్‌’ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని విఘ్నేశ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘ఇష్టమైన ఫుడ్‌ని ఆస్వాదించడానికి సరైన సమయం. మంచి మనుషులు, రుచికరమైన భోజనంతో ఈ ప్రదేశంలోనే మేము ఫుడ్‌ని ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తుంటాం’’ అని ఆయన రాసుకొచ్చారు. మరోవైపు, నయన్‌-విఘ్నేశ్‌ వచ్చే నెల 9న వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఈ మేరకు వీరి ఇంట పెళ్లి పనులు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి.

విజయ్‌-అనన్య@ముంబయి

నటుడు విజయ్‌ దేవరకొండ, నటి అనన్యపాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ఛార్మి, కరణ్‌ జోహర్‌ నిర్మాతలు. గత కొన్నిరోజుల క్రితం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరోవైపు, ‘లైగర్‌’ షూట్‌ పూర్తైన వెంటనే విజయ్‌.. తన తదుపరి చిత్రం ‘ఖుషి’ పనుల్లో బిజీగా ఉన్నారు. సామ్‌ కథానాయికగా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ కశ్మీర్‌లో ఇటీవల పూర్తైంది. దీంతో విజయ్‌ ముంబయికి చేరుకున్నారు. ‘లైగర్‌’ టీమ్‌ని కలిసి ప్రమోషన్స్‌ గురించి చర్చించారు. అనంతరం మంగళవారం సాయంత్రం అనన్య, ఛార్మిలతో కలిసి ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌ డేట్‌కు వెళ్లి వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని