రాజకీయాల్లోకి రమ్మని చెబుతారా?
టాలీవుడ్లో అగ్ర హీరోలు..దర్శకుల కాంబినేషన్ అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఇక కొత్త కాంబినేషన్ అయితే అంచనాలు మాములుగా ఉండవు. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఒకటి రాబోతున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంతో అల్లు
ఇంటర్నెట్ డెస్క్: కథ పక్కా అయింది. కలయిక కుదిరింది. ఇక ప్రకటనే ఆలస్యం. అల్లు అర్జున్ కథా నాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రకటించబోతున్నారు. అల్లు అర్జున్ చిన్ననాటి స్నేహితులు ముగ్గురు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ తన స్నేహితుల్ని, బంధువుల్ని తన సినిమాల్లో భాగం చేస్తుంటారు. ‘రేసుగుర్రం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘పుష్ప’ సినిమా నిర్మాణంలోనూ ఆయన బంధువులు భాగం పంచుకున్నారు. మరోసారి అదే తరహాలో అవకాశం ఇస్తున్నారు. అల్లు అర్జున్ కోసం కొరటాల శివ ఇటీవలే కథని సిద్ధం చేసి వినిపించినట్టు సమాచారం. అది పక్కా కావడంతో సినిమాని ప్రకటించాలని నిర్ణయించారు.
లాక్డౌన్ సమయంలో కొరటాల శివ అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేశారట. ఇందులో అల్లు అర్జున్ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారని తొలుత వార్తలొచ్చాయి. ఈ విషయంలో మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బన్నీ విద్యార్థి నాయకుడిగానే కాకుండా యువతను రాజకీయాల్లోకి రమ్మని చెప్పే యువకుడిగా కనిపిస్తాడట. మెరుగైన సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేసేలా కథ ఉండబోతోందట.ఈ సినిమా కోసం యువ రాజకీయాలపై కొరటాల అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యార్థి రాజకీయాల మీద కొన్ని సినిమాలు వచ్చాయి. అన్నీ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు - కొరటాల పిలుపు ఎలా ఉంటుందో చూడాలి. కొరటాల ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ త్వరలోనే ‘పుష్ప’ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ రెండింటి తర్వాతే అల్లు అర్జున్ - కొరటాల కలయికలో సినిమా పట్టాలెక్కబోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె