Tollywood: నూతన ఆరంభం
విశ్వంత్, శుభశ్రీ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అలీ, సునీల్, రఘుబాబు, ‘ఈరోజుల్లో’ సాయి, ఖయ్యూం, సత్యం రాజేష్ కీలక పాత్రధారులు. అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి
విశ్వంత్, శుభశ్రీ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అలీ, సునీల్, రఘుబాబు, ‘ఈరోజుల్లో’ సాయి, ఖయ్యూం, సత్యం రాజేష్ కీలక పాత్రధారులు. అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఇటీవల రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ హాస్యనటుడు అలీ క్లాప్నిచ్చారు. దండమూడి అవనీంద్ర కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఎంతో అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులు, సీనియర్ నటులు కలిసి పనిచేస్తున్నార’’న్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కృష్ణ చైతన్య ఓ మంచి కాన్సెప్ట్తో ఈ కథని సిద్ధం చేశారు. నటీనటులంతా కథని మెచ్చి ఇందులో భాగమయ్యారు. తప్పకుండా ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. కథానాయకుడిగా నాకో కొత్త ఆరంభాన్నిచ్చే చిత్రమవుతుందన్నారు విశ్వంత్. ఛాయాగ్రహణం: ఈశ్వర్, కూర్పు: అమర్రెడ్డి, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..