Tollywood: నూతన ఆరంభం

విశ్వంత్‌, శుభశ్రీ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అలీ, సునీల్‌, రఘుబాబు, ‘ఈరోజుల్లో’ సాయి, ఖయ్యూం, సత్యం రాజేష్‌ కీలక పాత్రధారులు. అవనీంద్ర కుమార్‌, సాయి గొట్టిపాటి

Updated : 04 Apr 2022 13:18 IST

విశ్వంత్‌, శుభశ్రీ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అలీ, సునీల్‌, రఘుబాబు, ‘ఈరోజుల్లో’ సాయి, ఖయ్యూం, సత్యం రాజేష్‌ కీలక పాత్రధారులు. అవనీంద్ర కుమార్‌, సాయి గొట్టిపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఇటీవల రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ హాస్యనటుడు అలీ క్లాప్‌నిచ్చారు. దండమూడి అవనీంద్ర కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఎంతో అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులు, సీనియర్‌ నటులు కలిసి పనిచేస్తున్నార’’న్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కృష్ణ చైతన్య ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ కథని సిద్ధం చేశారు. నటీనటులంతా కథని మెచ్చి ఇందులో భాగమయ్యారు. తప్పకుండా ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. కథానాయకుడిగా నాకో కొత్త ఆరంభాన్నిచ్చే చిత్రమవుతుందన్నారు విశ్వంత్‌. ఛాయాగ్రహణం: ఈశ్వర్‌, కూర్పు: అమర్‌రెడ్డి, సంగీతం: శ్రావణ్‌ భరద్వాజ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని