Tollywood: కథమ్మ... కలిపింది ఇద్దరినీ...!
కాంబినేషన్ల కంటే కథల్నే బలంగా విశ్వసిస్తున్నారు ఈతరం స్టార్ నాయికలు. కథ బాగుండి.. అందులో తమ పాత్రలకు ప్రాధాన్యముందనిపిస్తే చాలు.. ఇమేజ్ని పక్కకు పెట్టి మరీ ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు. ఓ వైపు అగ్ర కథానాయకులతో ఆడిపాడుతూనే.. మరోవైపు కుర్ర హీరోల సరసన సందడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా సినీప్రియులకు ప్రత్యేకమైన కలయికలు చూసే అవకాశం దక్కుతోంది.
కాంబినేషన్ల కంటే కథల్నే బలంగా విశ్వసిస్తున్నారు ఈతరం స్టార్ నాయికలు. కథ బాగుండి.. అందులో తమ పాత్రలకు ప్రాధాన్యముందనిపిస్తే చాలు.. ఇమేజ్ని పక్కకు పెట్టి మరీ ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు. ఓ వైపు అగ్ర కథానాయకులతో ఆడిపాడుతూనే.. మరోవైపు కుర్ర హీరోల సరసన సందడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా సినీప్రియులకు ప్రత్యేకమైన కలయికలు చూసే అవకాశం దక్కుతోంది.
ఒక్కసారి స్టార్ స్థాయికి చేరుకుంటే అందుకు తగ్గ కథలు, కాంబినేషన్లతోనే ప్రయాణం చేయాలనుకుంటారు కథానాయికలు. అందుకు విరుద్ధంగా ప్రయత్నిస్తే స్టార్డమ్ దెబ్బతింటుందన్న భయాలు వెంటాడేవి. ఈతరం నాయికలు అలాంటి భయాల్ని దూరం పెట్టేస్తున్నారు. కథ బాగుంటే చాలు.. అగ్ర, కుర్ర కథా నాయకులన్న లెక్కలకు పోకుండా రంగంలోకి దూకేస్తున్నారు.
* ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి విజయవంతమైన చిత్రాలతో నాయికా ప్రాధాన్య సినిమాలకు చిరునామాగా మారింది అనుష్క. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ భామ.. మళ్లీ కెరీర్ను పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె యు.వి. క్రియేషన్స్ బ్యానర్లో ఓ చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపింది. పి.మహేష్బాబు దర్శకుడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం.. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఓ కొత్తతరం కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో.. యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టితో కలిసి సందడి చేయనుంది అనుష్క. ఈ ప్రత్యేకమైన కాంబినేషన్పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
* చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు మొదలు.. రవితేజ, ప్రభాస్ వంటి ఈతరం హీరోల వరకు అందరితోనూ కలిసి పని చేసిన కథానాయిక నయనతార. ఇప్పుడామె చిరంజీవి - మోహన్రాజా కాంబినేషన్లో రూపొందుతోన్న ‘గాడ్ఫాదర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె యువహీరో సత్యదేవ్తో కలిసి తెర పంచుకోనుంది. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్’కు రీమేక్గా రూపొందుతోన్న చిత్రమిది. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.
* మరో సీనియర్ భామ తమన్నా సైతం యువ హీరోలతో కలిసి సందడి చేస్తోంది. ప్రస్తుతం వెంకటేష్కు జోడీగా ‘ఎఫ్3’, చిరంజీవికి జంటగా ‘భోళా శంకర్’ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. మరోవైపు ‘గుర్తుందా శీతాకాలం’ కోసం సత్యదేవ్తో తెర పంచుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా తాజాగా వరుణ్తేజ్ ‘గని’లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.
నాయికలకు భలే లాభం..
ఓ వైపు అగ్రహీరోలతో ఆడిపాడుతూనే.. కుర్రహీరోల చిత్రాల్లోనూ చేయడం సీనియర్ కథానాయికలకు భలే కలిసొస్తోంది. కోరినంత భారీ పారితోషికాలు దక్కించుకోవడంతో పాటు తామింకా కుర్ర భామలమే అన్న సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. ఫలితంగా వరుస అవకాశాలతో కెరీర్ని మరింత కాలం ముందుకు తీసుకెళ్లే అవకాశం దొరుకుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..