Songs: హత్తుకునేలా ‘బింబిసార’ గీతం.. మెలొడీతో ‘రంగ రంగ వైభవంగా’

కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. సంయుక్త మేనన్‌, కేథరిన్‌ కథానాయికలు. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 01 Aug 2022 20:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyanram) హీరోగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’ (Bimbisara). సంయుక్త మేనన్‌, కేథరిన్‌ కథానాయికలు. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ పాటను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘నీతో ఉంటే చాలు’ అంటూ సాగే ఈ గీతం శ్రోతల హృదయాల్ని హత్తుకునేలా ఉంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎం. ఎం. కీరవాణి రాసిన ఈ పాటని మోహన్‌ భోగరాజు, శాండిల్య ఆలపించారు.

సిరిసిరి మువ్వల్లోనే

వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaisshnav Tej), కేతికా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). గీరిశాయ దర్శకుడు. ఈ సినిమాని సెప్టెంబరు 2న విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం ‘సిరిసిరి మువ్వల్లోనే’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని పంచుకుంది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటని జవేద్‌ అలీ, శ్రేయా ఘోషల్‌ పాడారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని