Chiranjeevi: నాపై కోడిగుడ్లూ విసిరారు: చిరంజీవి

ప్రముఖ గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె హోస్ట్‌గా ‘నిజం’ (Nijam) పేరుతో సెలబ్రిటీ టాక్‌ షో ప్రారంభం కానుంది. మరో కొన్నిరోజుల్లో మొదలు కానున్న ఈ షో మొదటి ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది.

Updated : 08 Feb 2023 13:01 IST

హైదరాబాద్‌: నటుడిగా తాను ప్రశంసలే కాదు.. విమర్శలను సైతం ఎదుర్కొన్నట్లు చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). గతంలో తాను జగిత్యాలకు వెళ్లగా.. అక్కడ అభిమానులు తనపై పూలవర్షం కురిపించారని.. అదే సమయంలో కొంతమంది కోడిగుడ్లు కూడా విసిరారని ఆయన తెలిపారు. స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం విత్‌ స్మిత’ (Nijam With Smita) కార్యక్రమంలో పాల్గొన్న చిరుని.. ‘‘స్టార్‌డమ్‌ను సొంతం చేసుకునే క్రమంలో మీకు ఎదురైన అవమానాలు, అనుమానాలు ఏమిటి?’’ అని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా వివరించారు. అంతేకాకుండా తన కెరీర్‌ ఎలా మొదలైంది? తన ఫస్ట్‌ క్రష్ ఎవరు‌? ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎలా ఉంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి చిరు ఈ షోలో మాట్లాడారు. చిరంజీవి అతిథిగా ‘నిజం’ తొలి ఎపిసోడ్‌ ఫిబ్రవరి 10 నుంచి సోనీలివ్‌(Sony Liv)లో ప్రసారం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని