Nikhil: నిఖిల్‌కి పితృ వియోగం

యువ కథానాయకుడు నిఖిల్‌ ఇంట విషాదం  నెలకొంది. ఆయన తండ్రి కావలి శ్యామ్‌ సిద్ధార్థ (69) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  గురువారం సొంత ఇంట్లో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు

Updated : 29 Apr 2022 13:56 IST

యువ కథానాయకుడు నిఖిల్‌ ఇంట విషాదం  నెలకొంది. ఆయన తండ్రి కావలి శ్యామ్‌ సిద్ధార్థ (69) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  గురువారం సొంత ఇంట్లో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్యామ్‌ సిద్ధార్థ కళాశాలల్ని నిర్వహించారు. ఆయనకి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన నిఖిల్‌ కథానాయకుడిగా రాణిస్తున్నారు. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శ్యామ్‌ సిద్ధార్థ అంత్యక్రియలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని