నితిన్తో హైబ్రీడ్ పిల్ల?
నితిన్ సరసన హైబ్రీడ్ పిల్ల నటించబోతుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇంతకీ హైబ్రీడ్ పిల్ల ఎవరు అనుకుంటున్నారా?
ఇంటర్నెట్ డెస్క్: నితిన్ సరసన హైబ్రీడ్ పిల్ల నటించనుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇంతకీ హైబ్రీడ్ పిల్ల ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు యువ నాయిక సాయి పల్లవి. ‘భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల’ అంటూ యువతని ‘ఫిదా’ చేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలోనే నితిన్ కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
నూతన దర్శకుడు నితిన్- సాయి పల్లవి కలయికలో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథని అందించనున్నారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’, ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలతో అలరించిన నితిన్ ప్రస్తుతం ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా