Nivetha Pethuraj: విష్వక్ దర్శకత్వమంటే మొదట్లో భయపడ్డా!
బలమైన కథలు... పాత్రలతో ప్రయాణం చేస్తున్న కథానాయిక నివేతా పేతురాజ్. తొలిసారి ఆమె తనలోని గ్లామర్ కోణాన్ని ప్రదర్శిస్తూ ‘దాస్ కా ధమ్కీ’ చేశారు. విష్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమిది.
బలమైన కథలు... పాత్రలతో ప్రయాణం చేస్తున్న కథానాయిక నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj). తొలిసారి ఆమె తనలోని గ్లామర్ కోణాన్ని ప్రదర్శిస్తూ ‘దాస్ కా ధమ్కీ’ చేశారు. విష్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమిది. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నివేతా విలేకర్లతో ముచ్చటించింది.
ఇదివరకు మీరు చేసిన సినిమాలో పోలిస్తే ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి?
ప్రభుదేవాతో కలిసి తమిళంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు నువ్వు తెలుగులో నటిస్తుంటావు కదా, ఇక్కడికెందుకొచ్చావని అడిగారు. అక్కడ హుందాగా సాగే పాత్రలే వస్తున్నాయని చెప్పా. ‘వెళ్లి నువ్వు బాగా డాన్సులు చేసి, ఎక్కువ పారితోషికం తీసుకొచ్చేయ్’ అని చెప్పారు. ‘దాస్ కా ధమ్కీ’ అవకాశం వచ్చిననప్పుడు, ఇందులో గ్లామర్ పాత్ర అని చెప్పినప్పుడు మొదట భయపడ్డా. కానీ ఈ పాత్ర కోసమని బరువు తగ్గి నన్ను నేను కొత్తగా మలుచుకున్నా. సినిమా పూర్తయ్యాక నా కొత్త లుక్, డాన్స్ చేసిన వీడియోలు మా అమ్మకి పంపిస్తే ‘చాలా బాగుంది, ఎందుకు నువ్వు ఇప్పటిదాకా ఇలా చేయలేదు’ అన్నారు.
‘పాగల్’ తర్వాత మళ్లీ విష్వక్తో జోడీ కట్టారు. ఈ కథలో ఏం నచ్చింది?
‘దాస్ కా ధమ్కీ’ సినిమాకి కూడా వేరే హీరోయిన్ని అనుకున్నారట కానీ, ఉన్నట్టుండి ఆ అవకాశం నా దగ్గరికి వచ్చింది. కథ చెప్పాక నచ్చి చేయడానికి ఒప్పుకున్నా. చివర్లో కథ మారిందని చెప్పారు. చాలా భయమేసింది. అప్పుడు మరోసారి కథ విన్నాక ఇంకా నచ్చింది. అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది.
ఇదివరకు విష్వక్ని నటుడిగానే చూశారు. ఈ సినిమాకి నిర్మాత, దర్శకుడు కూడా. ఆయనతో ప్రయాణం ఎలా సాగింది?
హీరోలు నిర్మాణం కూడా చేయడాన్ని నేను చూశా. కానీ విష్వక్ దర్శకత్వం కూడా చేశాడు. ఆరంభంలో నేను చాలా భయపడ్డా. కానీ నాలుగు రోజుల తర్వాత అంతా సాఫీగా సాగుతోందనే అభిప్రాయం కలిగింది. త్రివిక్రమ్ సర్ తర్వాత మళ్లీ ఓ దర్శకుడిలో అంత ఎనర్జీని నేను చూసింది విష్వక్లోనే.
ఇక దర్శకత్వం జోలికి వెళ్లొద్దని ఇటీవల వేడుకలో విష్వక్కి చెప్పారు ఎన్టీఆర్. ఆ విషయంలో మీ అభిప్రాయమేమిటి?
ఒకవేళ దర్శకత్వం చేయాలనుకుంటే.. మరో హీరోతో సినిమా చేయమని విష్వక్కి చెప్పా. బాలకృష్ణలాంటి అగ్ర హీరోతో తను సినిమా చేస్తే బాగుంటుంది. తన దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. గ్యాంగ్స్టర్ సినిమాలంటే పిచ్చి. కమల్హాసన్ సర్ని లోకేశ్ కనగరాజ్ ఎంత మాస్గా చూపించారో, అలా చూపించగలడని నా నమ్మకం. తను అప్పుడప్పుడూ కొన్ని కథలు వినిపిస్తుంటాడు. దర్శకత్వం అంటే నాకూ ఇష్టం కాబట్టి నేను కూడా కొన్ని కథలు చెబుతుంటా (నవ్వుతూ). నిర్మాణంపై మాత్రం నాకు ఆసక్తి లేదు.
రేసింగ్ అంటే ఇష్టం కదా? ఆ నేపథ్యంలో కథలేమైనా విన్నారా?
కొద్దిమంది చెప్పారు. ఆ నేపథ్యంలో సినిమాలు చేయడం చాలా కష్టం. తమిళంలో అజిత్లాగా తెలుగులో రేసింగ్ని ఇష్టపడే కథానాయకులు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్, నాగచైతన్య... వీళ్లంతా రేసింగ్ గురించి బాగా మాట్లాడుతుంటారు. బయోపిక్ చేయాల్సి వస్తే కల్పనాచావ్లా జీవితం నేపథ్యంలో సినిమా చేయాలనుకుంటా. సౌందర్య అన్నా ఇష్టమే. కానీ సౌందర్య పాత్రకి నిత్యమేనన్ కరెక్ట్ అని నా అభిప్రాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు