Nivetha: ఫ్రైడ్‌రైస్‌లో బొద్దింక.. నటి ఫైర్‌

నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేస్తే.. అందులో బొద్దింక వచ్చింది. దీంతో ఈ నటి సదరు రెస్టారెంట్‌, ఫుడ్‌ డెలీవరి....

Published : 24 Jun 2021 13:07 IST

హీరోయిన్‌కి చేదు అనుభవం

హైదరాబాద్‌: నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేస్తే.. అందులో బొద్దింక వచ్చింది. దీంతో ఈ నటి సదరు రెస్టారెంట్‌, ఫుడ్‌ డెలీవరి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలో పేరుపొందిన ఓ ప్రముఖ రెస్టారెంట్‌ నుంచి బుధవారం సాయంత్రం నివేదా పేతురాజ్‌  ఫ్రైడ్‌ రైస్‌ను ఆర్డర్‌ చేశారు. ఫుడ్‌ డెలీవరి అయిన అనంతరం ప్యాక్‌ ఓపెన్‌ చేయగానే అందులో ఆమెకు బొద్దింక కనిపించింది. దీంతో ఆమె.. రెస్టారెంట్‌ని ట్యాగ్‌ చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఇటీవల కాలంలో హోటళ్లు సరిగ్గా పరిశుభ్రతను పాటించడం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. నేను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. ఈ హోటల్‌ వాళ్లు సరిగ్గా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. కొనుగోలుదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లపై భారీ జరిమానా విధించాలి’ అని ఆమె అన్నారు.

‘ఓరు నాల్‌ కొథు’ అనే తమిళ సినిమాతో నివేదా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం ఆమె ‘మెంటల్‌ మదిలో’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ‘చిత్రలహరి’, ‘అల.. వైకుంఠపురములో..’, ‘రెడ్‌’ చిత్రాల్లో నివేదా నటన ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘విరాటపర్వం’, ‘పాగల్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని