Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
స్టేజ్ షో వీడియోల కాపీరైట్తో అనుష్క శర్మ (Anushka Sharma) ఆదాయం పొందుతున్నారని, దానికి ఆమె సేల్స్ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై ఆమె బాంబే హైకోర్టుకు వెళ్లగా.. అక్కడ నటికి నిరాశే ఎదురైంది.
ముంబయి: విక్రయ పన్ను వివాదంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సతీమణి, ప్రముఖ నటి అనుష్క శర్మ (Anushka Sharma)కు బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ వ్యవహారంలో ఆమె వేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేసింది. పన్ను నోటీసులపై అప్పీల్ చేసుకునేందుకు తనకు ప్రత్యామ్నాయ అవకాశం ఉందని, దాన్ని వినియోగించుకోవాలని న్యాయస్థానం సూచించింది. (Anushka Sharma Tax Issue)
అసలేంటీ వివాదం..
2012-16 మధ్య ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయి పడిన అమ్మకపు పన్ను చెల్లించాలంటూ సేల్స్ ట్యాక్స్ (Sales Tax) డిప్యటీ కమిషనర్ పంపిన నోటీసులను సవాల్ చేస్తూ అనుష్క శర్మ (Anushka Sharma) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వివిధ సందర్భాల్లో నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం మేరకు కొన్ని అవార్డు కార్యక్రమాల్లోనూ ప్రదర్శనలను ఇస్తానని, అలాగని నిర్మాతలకు విధిస్తున్న శ్లాబులో పన్ను చెల్లించాలంటే ఎలాగని ఆమె ప్రశ్నించారు. వివిధ కార్యక్రమాల్లో నటించినంత మాత్రాన ఆ వీడియోల కాపీరైట్స్ తనకు రావని, కాపీరైట్స్ అన్నీ నిర్మాతకే ఉంటాయని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. సినిమాల్లో గానీ, ఇతర కార్యక్రమాల్లో గానీ ఎవరైనా నటిస్తే వాళ్లు నటులు మాత్రమే అవుతారని, నిర్మాతలు కాబోరని ఆమె తెలిపారు. నటులకు వర్తించే శ్లాబులోనే పన్ను వేయాలని ఆమె పిటిషన్లో కోరారు.
అయితే నటి వివరణను సేల్స్ ట్యాక్స్ (Sales Tax) విభాగం ఖండించింది. తన వీడియోల కాపీరైట్స్కు అనుష్క (Anushka Sharma)నే తొలి యజమాని అని, నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్ల నుంచి కొంత మొత్తం తీసుకుని ఆ కాపీరైట్ను ఆమె వారికి బదిలీ చేశారని తెలిపింది. చట్ట ప్రకారం ఇది విక్రయం కిందకే వస్తున్నందున.. పన్నులు చెల్లించాల్సిన బాధ్యత ఆమెదేనని పేర్కొంటూ బుధవారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
కోర్టు ఏం చెప్పిందంటే..
ఈ పిటిషన్లపై బాంబే హైకోర్టు (Bombay High Court) గురువారం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలను సమీక్షించిన అనంతరం.. అనుష్క పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు డివిజన్ బెంచ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మహారాష్ట్ర వ్యాల్యూ యాడెట్ టాక్స్ (MVAT) చట్టం ప్రకారం.. పిటిషనర్(అనుష్క శర్మ)కు అందిన నోటీసులపై అప్పీల్ చేసుకునేందుకు ఆమె ప్రత్యామ్నాయ అవకాశముంది. అలాంటప్పుడు ఈ పిటిషన్లను మేం విచారించాల్సిన అవసరమేంటీ? నాలుగు వారాల్లోగా ఆమె డిప్యూట్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ (అప్పీల్స్) ముందు అప్పీల్ చేసుకోవాలి. పిటిషనర్ లేవనెత్తిన అంశాలన్నింటిపై అప్పీలేట్ అథారిటీ సమగ్ర దర్యాప్తు జరిపి పరిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ పిటిషన్లను మేం విచారిస్తే.. MVAT చట్టం కింద ఉన్న అన్ని సమస్యలు ఇక్కడకే వస్తాయి’’ అని కోర్టు తెలిపింది. MVAT చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి తన నోటీసులపై అప్పీల్ చేయాలనుకుంటే.. సేల్స్ ట్యాక్స్ విభాగం విధించిన పన్ను మొత్తంలో 10శాతం డబ్బును డిపార్ట్మెంట్కు జమ చేయాల్సి ఉంటుంది.
2012-13, 2013-14, 2014-15, 2015-16 మదింపు సంవత్సరాలకు గానూ బకాయి ఉన్న పన్ను చెల్లించాలని సేల్స్ ట్యాక్స్ విభాగం నుంచి నటికి (Anushka Sharma) నోటీసులు అందాయి. 2012-13 మదింపు సంవత్సరానికి రూ.1.2కోట్లు, 2013-14 సంవత్సరానికి గానూ రూ. 1.6కోట్లు చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మిగతా రెండు సంవత్సరాలకు ఎంత బకాయి పడ్డారన్నది స్పష్టత లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది..
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే