Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘దృశ్యం2’ను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్‌.

Published : 18 Apr 2021 00:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన ‘దృశ్యం2’ను తెలుగులోనూ రీమేక్‌ చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. వెంకటేశ్‌, మీనా జంటగా మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ తాజా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పుడు కరోనా మరింత వ్యాపిస్తుండటంతో తెలుగులో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట నిర్మాత సురేశ్‌బాబు. దీనిపై ప్రస్తుతం చర్చ నడుస్తోందని టాక్‌. త్వరలోనే ఓ పెద్ద ఓటీటీని కలిసి సంప్రదింపులు చేయనున్నారని తెలుస్తోంది. చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్‌, కథనాయకుడు వెంకటేశ్‌ కూడా ఓటీటీకే మొగ్గు చూపారని సమాచారం. షూటింగ్‌ పూర్తయ్యేలోపు దీనిపై ఒక నిర్ణయానికి రానున్నారు. మరి తెలుగు ‘దృశ్యం2’ను ఓటీటీలో విడుదల చేస్తారా? మళ్లీ పరిస్థితులు చక్కబడి, థియేటర్లు తెరిచే వరకూ వేచి చూస్తారా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

నదియా, నరేశ్‌, కృతికా జయకుమార్‌, ఎస్తర్‌, పూర్ణ, సంపత్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని