15ఏళ్ల ‘బొమ్మరిల్లు’.. వేడుకలు చేసుకోబోమన్న సిద్ధార్థ్.. ఎందుకంటే..!
పిలల్లపై అతి ప్రేమ కూడా ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇదే విషయాన్ని చాలా సున్నితంగా చెప్పిన చిత్రం ‘బొమ్మరిల్లు’. ఈ సినిమా డైరెక్టర్ భాస్కర్తో పాటు హీరోహీరోయిన్లు సిద్ధార్థ్, జెనిలియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అవార్డుల పంట పండించింది. భారీ ఫైట్ సీక్వెన్సులు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ లేకుండానే అతి సాధారణమైన కథతో సినిమా భారీ విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: పిలల్లపై అతి ప్రేమ కూడా ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇదే విషయాన్ని చాలా సున్నితంగా చెప్పిన చిత్రం ‘బొమ్మరిల్లు’. ఈ సినిమా డైరెక్టర్ భాస్కర్తో పాటు హీరోహీరోయిన్లు సిద్ధార్థ్, జెనిలియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అవార్డుల పంట పండించింది. భారీ ఫైట్ సీక్వెన్సులు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ లేకుండానే అతి సాధారణమైన కథతో సినిమా భారీ విజయం సాధించింది. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికీ చాలామంది ఫోన్లలో రింగ్టోన్గా వినిపిస్తోంది. ఎవరైనా తండ్రికొడుకుల మధ్య అతి ప్రేమ కనిపిస్తే.. ‘ఏంట్రా మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్లా ఉన్నారు’ అనే అంతగా సినిమా యువత మనసులో నాటుకుపోయింది. 2006 ఆగస్టు 9న విడుదలైందీ ప్రేమకథా చిత్రం. విడుదలై నేటితో 15 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆ సినిమా హీరో సిద్ధార్థ్ ఓ ఆసక్తికరమై ట్వీట్ చేశాడు.
‘‘నేటితో ‘బొమ్మరిల్లు’కు 15ఏళ్లు. కానీ మేం వేడుకలు చేసుకోవడం లేదు. ‘మహాసముద్రం’ థియేటర్లలో పూర్తిస్థాయిలో విడుదలైన రోజే వేడుకలు చేసుకోవాలనుకుంటున్నాం. త్వరలోనే థియేటర్లలో కలుద్దాం’ అంటూ సిద్ధార్థ్ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. సిద్ధార్థ్ ప్రస్తుతం ‘మహా సముద్రం’లో నటిస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఆగస్టు 19న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇదిలా ఉండగా.. సిద్ధార్థ్, జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసింది. దిల్రాజు నిర్మించారు. సినిమా మంచి విజయం సాధించడంతో సినిమా పేరు కాస్తా దర్శకుడికి ఇంటిపేరుగా మారింది. ప్రకాశ్రాజ్, జయసుధ, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, తనికెళ్ల భరణి, మురళీమోహన్, రవి వర్మ, చిత్రం శ్రీను, సురేఖ వాణి తదితరులు నటించారు. దేవి శ్రీప్రసాద్ అందించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలీ’, ‘బొమ్మని గీస్తే నీలావుంది దగ్గరకొచ్చి ముద్దిమ్మంది..’, ‘వీ హ్యావ్ ఎ రోమియో’, ‘నమ్మక తప్పని నిజమైనా’ పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు తొలుత ఎన్టీఆర్ను హీరోగా అనుకున్నప్పటికీ డేట్లు సర్దుదబాటు కాకపోవడంతో సిద్ధార్థ్ను తీసుకున్నారట. ఈ చిత్రాన్ని తమిళంలో ‘సంతోష్ సుబ్రమణియన్’ పేరుతో, బెంగాలీలో ‘భలోబాసా భలోబాసా’, ఒరియాలో ‘డ్రీమ్ గర్ల్’గా, హిందీలో ‘ఇట్స్ మై లవ్’ పేర్లతో రీమేక్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్