NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్
కల్యాణ్రామ్ హీరోగా కొత్త దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ అతిథిగా హాజరై, సందడి చేశారు.
హైదరాబాద్: అప్డేట్ కావాలంటూ చిత్ర దర్శక, నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావొద్దని అభిమానులకు ప్రముఖ నటుడు ఎన్టీఆర్ (NTR) విజ్ఞప్తి చేశారు. చెప్పాల్సిన సందర్భం వస్తే తన భార్య కంటే ముందుగా వారికే చెబుతానని పేర్కొన్నారు. ‘అమిగోస్’ (Amigos) ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన సోదరుడు కల్యాణ్రామ్ (Kalyan Ram) హీరోగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో వేడుక నిర్వహించారు.
వేడుకనుద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా మీ అందరినీ చూసేందుకు ఇక్కడికి వచ్చా. దర్శకుడు రాజేంద్ర ఇంజినీరింగ్ చదివారు. ‘చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఎందుకీ సినిమాలు’ అని తన తల్లిదండ్రులు అంటే ‘నేను ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ఇంటికి వస్తా’ అని ఆయన సమాధానమిచ్చారు. కానీ, సినిమా ప్రారంభమయ్యేలోపు తన మాతృమూర్తిని కోల్పోయారు. చిత్రీకరణ ఆఖరి దశలో ఉండగా వారి నాన్న కన్నుమూశారు. రాజేంద్రను చూస్తుంటే సినిమా పట్ల ఓ వ్యక్తికి ఇంత తాపత్రయం ఉంటుందా? అని అనిపిస్తుంటుంది. ఈ సినిమా హిట్కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నా శ్రేయోభిలాషులు. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు సినిమాలు విడుదలై, సూపర్హిట్ అందుకోవడం వారికే సాధ్యమైంది. మా కుటుంబంలో ఎంతమంది నటులున్నా.. ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేసింది కల్యాణ్ అన్న ఒక్కరే. నటుడిగా, నిర్మాతగా సినిమాల్లో టెక్నాలజీకి పెద్దపీట వేసింది ఆయనే. అన్నయ్య ఏంటీ ప్రయోగాత్మక చిత్రాలే చేస్తారా.. మరి మాస్ సినిమాలు ఎప్పుడు చేస్తారు? అని ఒకానొక సమయంలో అనుకున్నా. ‘అతనొక్కడే’, ‘పటాస్’ ‘బింబిసార’తో ఆ లోటును తీర్చారు. మూడు విభిన్న పాత్రలను ఒకే సినిమాలో పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘ఎమిగోస్’ సినిమా కల్యాణ్ అన్న కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందని నమ్ముతున్నా’’
‘‘మేం అమెరికా, జపాన్ వెళ్లామని, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు వెళ్లామని, ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కిందంటూ చాలామంది గొప్పగా చెబుతున్నారు. అయితే, అది మా గొప్పతనంకాదు. ప్రేక్షకులు, అభిమానుల ఆశీర్వాదంతో పాటు తోటి నటీనటులు, కార్మికుల ప్రోత్సహం, ప్రేమతో అక్కడికి వెళ్లాం. అన్నింటి కంటే ముఖ్యంగా ఇది జక్కన్న (రాజమౌళి) విజయం. ఆయన మాకు ఆ పాత్రలను ఇచ్చారు కాబట్టే ఇన్ని ప్రశంసలు దక్కుతున్నాయి’’ అని తెలిపారు.
మీ ఉత్సాహం నాకు అర్థమవుతోంది.. కానీ,
అభిమానులు తన తదుపరి చిత్రం అప్డేట్ ఇవ్వాలంటూ హంగామా చేస్తుంటే ఎన్టీఆర్ స్పందించారు. ‘‘సినిమాలు చేసేటపుడు మీతో చెప్పేందుకు ఏం ఉండదు. ప్రతిరోజూ, ప్రతి పూటా, ప్రతి గంటకూ అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, ఉత్సాహం నాకు అర్థమవుతోంది. కానీ, దానివల్ల దర్శక- నిర్మాతలపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఫ్యాన్స్ అడుగుతున్నారని వారు భావించి ఏది పడితే అది చెప్పలేరు. ఏదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు అది నచ్చకపోతే మళ్లీ వాళ్లనే మీరు తిడతారు. ఇది నా విషయంలోనే కాదు అందరు హీరోలకు ఇలానే జరుగుతోంది. తప్పకుండా ఇవ్వాల్సిన, అదిరిపోయే అప్డేట్ ఏదైనా ఉంటే భార్యకంటే ముందు మీకే చెబుతాం. ఎందుకంటే మీరు మాకు అంత ముఖ్యం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా ఈ నెలలోనే సినిమాని లాంఛనంగా ప్రారంభిస్తాం. మార్చి 20లోపే చిత్రీకరణ మొదలుపెడతాం. 2024 ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న చిత్రమది.
ఈ చిత్రాలు వేరు.. అమిగోస్ వేరు: కల్యాణ్రామ్
‘‘అమిగోస్ (ఫ్రెండ్స్) అంటే ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ద్విపాత్రాభినయం (అన్నదమ్ముల నేపథ్యంలో)ను ప్రారంభించింది మా తాతగారు. రాముడు- భీముడు చిత్రంతో అది మొదలైంది. తప్పు చెప్పి ఉంటే క్షమించండి. ఆ తర్వాత బాబాయ్ బాలకృష్ణ అదే పేరుతో ఓ సినిమా చేశారు. చిరంజీవి గారు ‘ముగ్గురు మొనగాళ్లు’ చేశారు. తమ్ముడు ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ చేశాడు. వీటన్నింటిలోని కామన్ పాయింట్ ఆయా పాత్రల మధ్య కుటుంబ బంధం. కానీ, అమిగోస్ విభిన్నంగా ఉంటుంది. మీరంతా ఆదరిస్తారనే నమ్మకంతోనే నేనెప్పుడూ వైవిధ్యభరిత చిత్రాలు చేస్తుంటా. ఇంతకాలం నన్ను భరించినందుకు ధన్యవాదాలు (నవ్వులు). నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించిన తమ్ముడు తారక్కి థాంక్స్’’ అని కల్యాణ్రామ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
‘కాంతార 2’ హీరోయిన్పై చిత్ర పరిశ్రమలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? -
Arundhathi Nair: ప్రమాదంలో హీరోయిన్కు తీవ్ర గాయాలు.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు
మలయాళ హీరోయిన్ అరుంధతీ నాయర్ తీవ్ర గాయాల పాలయ్యారు. -
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) ‘శక్తిమాన్’ పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తోన్న వార్తలపై ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేశ్ ఖన్నా స్పందించారు. -
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ
తాను క్షేమంగానే ఉన్నానని సింగర్ మంగ్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. -
Prithiveeraj: పృథ్వీరాజ్తో పెళ్లి జరగలేదు.. మేమిద్దరం విడిపోయాం: శీతల్ పోస్ట్
నటుడు పృథ్వీరాజ్తో తనకు పెళ్లి జరగలేదని శీతల్ తెలిపింది. ఈమేరకు ఆమె ఓ పోస్ట్ పెట్టింది. -
Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన గాయని హారికా నారాయణ్
యువ గాయని హారికా నారాయణ్ పెళ్లి వేడుకగా జరిగింది. -
Elvish Yadav: పాము విషం ఏర్పాటు చేశా.. కీలక విషయాలు వెల్లడించిన బిగ్బాస్ ఓటీటీ విజేత..!
పాము విషంతో రేవ్పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్లో ఉన్నారు యూట్యూబర్, బిగ్బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్. విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. -
Tharun Bhascker: ‘కీడాకోలా’లో ఎస్పీ బాలు పాట.. లీగల్ నోటీసులపై తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే!
‘కీడా కోలా’ (Keedaa Cola)లో ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంతో నెలకొన్న వివాదంపై చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్పందించారు. -
Meetha Raghunath: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ‘గుడ్నైట్’ స్టార్
రకుల్ ప్రీత్ సింగ్, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది. -
Aadujeevitham: ఆ పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను: పృథ్వీరాజ్ సుకుమారన్
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
Social Look: అమృత ‘పాజిటివ్’ పోస్ట్.. అనుపమ సెల్ఫీ.. ప్రియాంకా చోప్రా న్యూ లుక్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Ileana: నన్ను అంటే పడ్డా.. కానీ, అతడిని విమర్శిస్తే నేను తట్టుకోలేను: ఇలియానా
తన భాగస్వామి మైఖేల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి ఇలియానా (Ileana). అతడు తనని ఎంతో గౌరవమిస్తాడన్నారు. -
Vicky Kaushal: ఆ సినిమా విడుదల టెస్ట్ మ్యాచ్ అవుతుందని ముందే తెలుసు: విక్కీకౌశల్
బాలీవుడ్ నటుడు విక్కీకౌశల్ తన సినిమా ‘సామ్ బహదూర్’ బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్న పోటీ గురించి మాట్లాడారు. -
Kriti Sanon: ఆ సినిమా కోసం రోజుకు 17 గంటలు పనిచేశా: కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ నిర్మాతగా రోజుకు 17 గంటలు పనిచేశానని తెలిపారు. -
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ దర్శకుడి రియాక్షన్
‘యానిమల్’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన్ను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. -
Bhoomi Shetty: ఇంట్లోవాళ్లు నాతో ఆరేళ్లు మాట్లాడలేదు.. హేళన చేశారు: భూమి శెట్టి
‘షరతులు వర్తిస్తాయి’తో నటిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ భూమిశెట్టి (Bhoomi Shetty). సహజమైన నటనతో తెలుగువారిని మెప్పించారామె. -
Social Look: ‘ఫ్యామిలీ స్టార్’ షూట్ పూర్తి.. రేంజ్ రోవర్ కొన్న హీరో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Vijay Antony: డిప్రెషన్.. విజయ్ ఆంటోనీ ఏమన్నారంటే..?
తన తదుపరి చిత్రం ‘రోమియో’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). తెలుగులో ఇదే చిత్రాన్ని ‘లవ్ గురు’ పేరుతో విడుదల చేయనున్నారు. -
vishnu vishal: ఆ సినిమా విడుదల నిర్మాతల నిర్ణయం: విష్ణు విశాల్
‘పొన్ ఒండ్రు కండేన్’ సినిమాపై ఎక్స్లో ట్వీట్ చేశారు. -
Manchu Vishnu: కన్నప్ప కథ.. కామిక్ బుక్ విడుదల చేయనున్న మంచు విష్ణు
‘కన్నప్ప’తో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). ఇటీవల విడుదల చేసిన ఆ సినిమా ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు