Bimbisara: ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌..!

టాలీవుడ్‌ హీరోల్లో ఎన్టీఆర్‌ వాయిస్‌కు ఎంతో ప్రత్యేక ఉంది. అందుకే నటన, డ్యాన్స్‌, డైలాగ్స్‌కే పరిమితం కాకుండా కొన్ని సినిమాల్లో ఆయన తన గొంతుకు పని పెంచి గాయకుడిగా మారి రాగం ఆలపించారు తారక్‌. తన గొంతులో ఎన్నో వేరియేషన్స్‌ పలికించగల సామర్థ్యం ఎన్టీఆర్‌ సొంతం. సినిమాల్లో కథను ఎన్టీఆర్‌ వాయిస్‌తో వింటే ఆ మాజానే వేరు కదా..! అయితే..

Updated : 07 Jul 2021 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు హీరోల్లో ఎన్టీఆర్‌ వాయిస్‌కు ఎంతో ప్రత్యేక ఉంది. అందుకే నటన, డ్యాన్స్‌, డైలాగ్స్‌కే పరిమితం కాకుండా కొన్ని సినిమాల్లో ఆయన తన గొంతుకు పని పెంచి గాయకుడిగా మారి రాగం ఆలపించారు తారక్‌. తన గొంతులో ఎన్నో వేరియేషన్స్‌ పలికించగల సామర్థ్యం ఎన్టీఆర్‌ సొంతం. సినిమాల్లో కథను ఎన్టీఆర్‌ వాయిస్‌తో వింటే ఆ మజానే వేరు కదా..! అయితే.. అలా కోరుకునే వారికోసం ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారమవుతోంది. తన సోదరుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న ‘బింబిసార’ చిత్రానికి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ అందించబోతున్నారట. మగధ సామ్రాజ్యంలోని హర్యంక రాజవంశ రాజు బింబిసారుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

కాగా.. తన సోదరుడు కల్యాణ్‌రామ్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ భాగం కావాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న తారక్‌ ‘బింబిసార’ చిత్రానికి తన వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అయితే.. దీనికి సంబంధించి చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరి ఈ వార్తల్లో ఏ మేరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే మరి. అంతేకాదు.. సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ తారక్‌ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

కల్యాణ్‌రామ్‌ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘బింబిసార’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే.. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తొలుత ఒక భాగంలోనే కథ మొత్తం వివరించాలని భావించినా.. మూడు భాగాల్లో అయితే బాగుంటుందని దర్శక-నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌కు జంటగా కేథరిన్‌, సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం సమకూర్చనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కొరాటల శివతో ఒక చిత్రం, ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో మరో చిత్రం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని