Sarkaru Vaari Paata: మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ మరోసారి వాయిదా?

సినిమా విడుదల షెడ్యూల్స్‌ను కరోనా కకావికలం చేస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు వాయిదా పడగా,

Published : 12 Jan 2022 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా విడుదల షెడ్యూల్స్‌ను కరోనా కకావికలం చేస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు వాయిదా పడగా, పలువరు స్టార్స్‌ కరోనా బారినపడటం వారి సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. మహేశ్‌బాబు(Mahesh babu) కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata). సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమాను వివిధ కారణాలతో ఏప్రిల్‌ 1న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh babu)తోపాటు, కీర్తిసురేశ్‌(keerthy suresh) కూడా కరోనా బారినపడ్డారు. ఇద్దరూ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరు హోం ఐసోలేషన్‌ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పైగా మహేశ్‌బాబుకు ఇటీవల శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో ‘సర్కారువారి పాట’ చిత్రీకరణ మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్‌ 1వ తేదీకి సినిమా పూర్తయ్యే సూచనలు దాదాపు కనిపించటం లేదు. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా వేయటం తప్ప చిత్ర బృందానికి మరో అవకాశం లేదని టాలీవుడ్‌ టాక్‌. పరిస్థితులన్నీ చక్కబడి సినిమా చిత్రీకరణ పూర్తయితే ఆగస్టు 5న విడుదల చేయాలని దర్శక-నిర్మాతలు యోచిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని