అప్పుడు మనసుకు కష్టమనిపించింది
‘‘ఒకే సమయంలో రెండు చిత్రాలు తెరకెక్కించడం గతంలో పెద్ద దర్శకుల విషయంలో జరిగింది. ఇప్పుడు మళ్లీ నా జీవితంలో జరుగుతోంద’’న్నారు విజయ్ కుమార్ కొండా. ‘గుండెజారి గల్లంతయ్యిందే’
‘‘ఒకే సమయంలో రెండు చిత్రాలు తెరకెక్కించడం గతంలో పెద్ద దర్శకుల విషయంలో జరిగింది. ఇప్పుడు మళ్లీ నా జీవితంలో జరుగుతోంద’’న్నారు విజయ్ కుమార్ కొండా. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ వంటి వినోదాత్మక ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడాయన నుంచి వచ్చిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. రాజ్తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రమిది. ఇటీవలే ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆన్లైన్ ద్వారా మీడియాతో ముచ్చటించారు విజయ్ కుమార్.
ఆశించిన ఫలితం అందింది
థియేటర్లో ప్రేక్షకులంతా పడిపడి నవ్వుకునేలా చేయాలన్న లక్ష్యంతోనే ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దాం. కరోనా - లాక్డౌన్ పరిస్థితుల వల్ల వెండితెర ఆనందాల్ని మిస్సయినా.. ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులంతా ఇంటి నుంచే మా వినోదాన్ని కుటుంబ సమేతంగా ఆస్వాదిస్తున్నారు. మేం సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఆశించినది ఇదే. ఇప్పుడా ఫలితాన్ని ‘ఆహా’ ఓటీటీ వేదికగా అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
కథ రాసుకున్నప్పుడే అనుకున్నా
ఈ కథకు ప్రత్యేకంగా స్ఫూర్తంటూ ఏమీ లేదు. ముందు నుంచీ ఈ చిత్రంతో పూర్తి వినోదాన్ని పంచివ్వాలని గట్టిగా ఫిక్సయిపోయా. దీనికి తగ్గట్లుగా ఈ కథ సిద్ధం చేసుకున్నాక.. బుజ్జిగాడు పాత్రకు రాజ్తరుణ్ సరిపోతారనిపించి తన వద్దకు వెళ్లా. ఎందుకంటే దీంట్లో హీరో పాత్ర పక్కింటి కుర్రాడిలా అనిపించాలి. సినిమా అంతా నవ్వించాలి. ఆ లక్షణాలన్నీ రాజ్తరుణ్లోనే ఉన్నాయి. అందుకే తననే ఈ చిత్రానికి ఎంపిక చేసుకున్నాం. ఇది సినిమాకు కలిసొచ్చింది. అలాగే మాళవిక పాత్రకి ముందు నుంచి తననే అనుకున్నాం.
అందుకే గ్యాప్ వచ్చింది
‘ఒక లైలా కోసం’ తర్వాత వెంటనే ఒక హీరోతో సినిమా అనుకున్నా. ఇద్దరం ఒక కథ అనుకొని దానితోనే కొంత కాలం ట్రావెల్ అయ్యాం. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరో రెండు మూడు చిత్రాలకీ ఇదే జరిగింది. ఆ సమయంలో చాలా బాధపడ్డా. మన కథలో తప్పులుంటే పెద్దగా పట్టించుకోం. కానీ, ఒక జోనర్లో సినిమా అనుకుని దానిపై కొంత కాలం వర్క్ చేశాక, ఇప్పుడిది వద్దు మరొకటి ట్రై చేద్దామంటే మనసుకు కష్టంగా అనిపించేది. నాకు ఓపిక, కసి రెండూ ఎక్కువే కాబట్టి ఆ కథలు పక్కకు పెట్టి మరో కథతో రాజ్తరుణ్తో సినిమా చేశా. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో సెట్స్పై ఉన్నా.
విభిన్నంగా ప్రయత్నిస్తున్నా
నాకు వినోదాత్మక ప్రేమకథలంటే చాలా ఇష్టం. కానీ ఇకపై విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ప్రస్తుతం రాజ్తరుణ్తోనే చేస్తున్న మరో కొత్త చిత్రాన్ని ఓ చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతోనే తెరకెక్కిస్తున్నాం. ఇప్పుడు మొయినాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్తో చేస్తున్న ‘రైడర్’ చిత్రం సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాస్కెట్ బాల్ ఆట నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. నాకెంతో ప్రత్యేకమైన ప్రాజెక్టిది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా