OTT Movies: సంక్రాంతి బ్లాక్‌ బస్టర్స్‌ ఓటీటీలో వచ్చేస్తున్నాయి.. ఏ మూవీ.. ఎప్పుడంటే?

Ott movies: సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలన్నీ ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు స్ట్రీమింగ్‌ అవుతుండగా, మిగిలినవి వచ్చే వారం స్ట్రీమింగ్‌ కానున్నాయి.

Published : 19 Feb 2023 12:34 IST

Ott movies: సంక్రాంతి కానుకగా వరుసగా అగ్ర కథానాయకుల చిత్రాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. అంతేకాదు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్నీ కురిపించాయి. ఇప్పుడు ఈ చిత్రాలన్నీ ఓటీటీ వేదికగా వచ్చేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో రెండు చిత్రాలు ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతుండగా, మిగిలినవీ కూడా డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాయి. దీంతో సంక్రాంతికి ఆ సినిమాలను చూడలేకపోయిన వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆ రెండూ చిత్రాలు ఇప్పటికే స్ట్రీమింగ్‌

స్టార్‌ హీరో అజిత్ (Ajith) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘తునివు’ (Thunivu). తెలుగులో ఇదే చిత్రం ‘తెగింపు’ పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.  అలాగే సంతోష్‌ శోభన్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన న్యూఏజ్‌ డ్రామా ‘కళ్యాణం కమనీయం’ (kalyanam kamaneeyam). సంక్రాంతికి చిన్న చిత్రంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.


అప్పుడు చివరిగా.. ఇప్పుడు కాస్త ముందుగా..

తమిళ స్టార్‌ విజయ్‌ (Vijay) కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వారిసు’. సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కుటుంబ కథా చిత్రంగా పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.


మాస్‌ ప్రేక్షకులను మరోసారి మెప్పించేందుకు..

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపీ చంద్‌ మలినేని దర్శకత్వం వహించిన యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘వీరసింహారెడ్డి’ (veera simha reddy). శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి రేసులో నిలిచిన తొలి చిత్రం కాగా, బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం, దునియా విజయ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విలనిజం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఫిబ్రవరి 23 సాయంత్రం 6గంటల నుంచి ‘వీరసింహారెడ్డి’ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.


థియేటర్‌లో రికార్డులు బద్దలు కొట్టి..

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya). శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా రూ.200 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని