padutha theeyaga: ‘పాడుతా తీయగా’ 19వ సీజన్ ప్రత్యేకతలివే..!
సంగీతంతో ఎస్పీ బాలు(SP Balu)ది ఎన్నెన్నో జన్మల బంధం. అది ఎన్నటికీ వీడని రాగబంధం. పరిమళ గంధం. గంధర్వులే
సంగీతంతో ఎస్పీ బాలు(SP Balu)ది ఎన్నెన్నో జన్మల బంధం. అది ఎన్నటికీ వీడని రాగబంధం. పరిమళ గంధం. గంధర్వులే ఆవహించారేమో అన్నట్టు ఆయన పాడతారు. పాడటమే కాదు వేలమంది యువగాయకుల స్వరమై నిలిచారు. 1996లో ఈటీవీలో ప్రారంభమైన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) బాలు మానస పుత్రిక. దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) అనేకమంది గాయకులను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలుగు సినీ నేపథ్యగానానికి యువ ప్రతిభావంతులను అందించిన ఏకైక వేదిక బాలు గారి సారథ్యంలో సాగిన ఈటీవీ పాడుతా తీయగా(Padutha Theeyaga) దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షో.
తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా అద్భుత గాయకులను వెలుగులోకి తెచ్చిన ఘనత పాడుతా తీయగా ఖండాంతరాలకు వ్యాపించి ఇతరదేశాల్లోనూ దీనిని నిర్వహించటం విశేషం. తెలుగుసినీ సంగీతాన్ని ఉత్తేజితం చేసిన గాయనీ, గాయకులు, సంగీత దర్శకులు ఉష, హేమచంద్ర, కారుణ్య, రామాచారి, మాళవిక, కౌసల్య, స్మిత, కె.ఎం.రాధాకృష్ణ, గోపికా పూర్ణిమా, సాహితి, దామిని, మల్లిఖార్జున్ వంటి ఎందరో తాము ఈటీవీ పాడుతా తీయగా(Padutha Theeyaga) ద్వారానే వెలుగులోకి వచ్చామని గర్వంగా చెప్పుకుంటారు. అలా 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తొలిసారి బాలు పరోక్షంలో ఆయన లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయన వారసుడు ఎస్పీ చరణ్(SP Charan) బాలు గారి సారథ్య బాధ్యతలను స్వీకరించారు. ఈటీవీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అందుకు ప్రతీకగా మైకును ఇటీవల జరిగిన బాలు ప్రథమ వర్థంతి సభలో చరణ్ చేతికి అందించారు. గతంలో బాలు గారు ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ ఈసారి స్వయంగా తన భుజాలపై వేసుకుని 19వ సీజన్ను నడిపించటం విశేషం.
కరోనా దృష్ట్యా ఈటీవీ నిర్వహించిన ఆన్లైన్ ఆడిషన్స్లో 4వేలమంది గాయనీగాయకులు పాల్గొన్నారు. వాటి అన్నింటినీ వడపోసి 16మందిని 19వ సీజన్కు ఎంపిక చేశారు న్యాయనిర్ణేతలు. యంగ్ టాలెంట్ను గుర్తించటానికి ఈ కార్యక్రమానికి ముగ్గురు ప్రముఖ సెలబ్రిటీలు జడ్జిలుగా వ్యవహరిస్తారు. అద్భుతకలంతో హృదయాన్ని మీటే పాటలు రాసిన చంద్రబోస్(Chandra bose), తీయనైన తేనెలాంటి స్వరంతో అలరించే మధురగాయని సునీత(sunitha), ఆస్కార్ అవార్డు అందుకున్న జయహో గీతాలాపన చేసిన వారిలో ఒకరైన యువకెరటం విజయ్ ప్రకాష్(vijay prakash)లు పాడుతా తీయగా 19వ సీజన్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. బాలు ప్రాణంపోసిన ఆయన మానస పుత్రిక ఈటీవీ పాడుతా తీయగా(Padutha Theeyaga) ద్వారా మధుర తుషారాలు మనసును తాకుతాయి. మధువనాలు మళ్లీ పూస్తుంటాయి. బాలు దీవెనలతో ఆయన రాగరంజిత గానం మన హృదయాల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రేక్షకలోకం పరవశిస్తూనే ఉంటుంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్