Cinema News: నవ్వులు పంచే క్రైమ్‌ థ్రిల్లర్‌

అభిలాష్‌ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘పగ పగ పగ’. రవి శ్రీ దుర్గా ప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు. సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమాతో సంగీత దర్శకుడు కోటి ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌ను  దర్శకుడు మెహర్‌ రమేష్‌ ఇటీవల విడుదల చేశారు.

Updated : 13 Aug 2022 08:49 IST

భిలాష్‌ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘పగ పగ పగ’. రవి శ్రీ దుర్గా ప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు. సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమాతో సంగీత దర్శకుడు కోటి ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌ను  దర్శకుడు మెహర్‌ రమేష్‌ ఇటీవల విడుదల చేశారు. ‘‘హలో పెజ్జోని పేటోడికి పని ఇస్తే.. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసి చస్తాడు’’ అంటూ ప్రచార చిత్రంలో కోటి చెప్పిన డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. ‘‘వినోదాత్మకంగా సాగే క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇద’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి  కూర్పు: పాపారావు, ఛాయాగ్రహణం: నవీన్‌ కుమార్‌ చల్లా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని