‘పాగల్‌’తో జోడి కట్టిన నివేదా!

‘ఫలక్‌నుమాదాస్‌’చిత్రంతో విశ్వక్‌సేన్‌ యూత్‌లో మాస్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘పాగల్‌’అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నరేష్‌ కొప్పిలి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా సంస్థ, ఎస్వీసీ సంస్థలు సంయుక్తంగా

Published : 18 Mar 2021 11:26 IST

హైదరాబాద్‌: ‘ఫలక్‌నుమాదాస్‌’చిత్రంతో విశ్వక్‌సేన్‌ యూత్‌లో మాస్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘పాగల్‌’అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నరేష్‌ కొప్పిలి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా సంస్థ, ఎస్వీసీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ను చిత్రబృందం ప్రకటించింది. ‘తీరా’ పాత్రలో నటిస్తున్న ఆమె పోస్టర్‌ను విడుదల‌ చేశారు. మరో హీరోయిన్‌గా సిమ్రన్‌ చౌదరీ నటిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని మే 1న థియేటర్లలోకి తీసుకురానున్నట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని