Paresh Rawal: క్షమించండి.. కేవలం నిద్రపోయా!!
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం విజృంభిస్తోన్న వేళ సోషల్మీడియాలో ఫేక్ న్యూస్లు సైతం చక్కర్లు కొడుతున్నాయి. సోషల్మీడియా ఓపెన్ చేస్తే ఓ వైపు కరోనా వైరస్ మరోవైపు సెలబ్రిటీల ఆరోగ్య పరిస్థితులు గురించి వచ్చే వార్తలు క్యూ కడుతున్నాయి....
ఫేక్ న్యూస్పై నటుడి సెటైర్
ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం విజృంభిస్తోన్న వేళ సోషల్మీడియాలో ఫేక్ న్యూస్లు సైతం చక్కర్లు కొడుతున్నాయి. సోషల్మీడియా ఓపెన్ చేస్తే ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు సెలబ్రిటీల ఆరోగ్య పరిస్థితులు గురించి ఎక్కువగా వార్తలు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ కన్నుమూసినట్లు శుక్రవారం ఉదయం నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆయన అనారోగ్యం కారణంగా నిన్న ఉదయం ఏడు గంటలకు కన్నుమూశారని వార్తలు దర్శనమిచ్చాయి. అయితే వీటిపై పరేశ్ రావల్ సెటైరికల్గా స్పందించారు. ‘క్షమించండి.. మీరు చెబుతున్నట్లు ఏడు గంటల సమయంలో నేను నిద్రలో ఉన్నా. శాశ్వత నిద్రలో కాదు’ అని పోస్ట్ పెట్టారు.
బాలీవుడ్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో పరేశ్ రావల్.. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా నటించి మెప్పించారు. ‘మనీ’తో ఆయన నటుడిగా తెలుగు తెరపై మెరిశారు. ‘గోవిందా గోవిందా’, ‘మనీ మనీ’, ‘బావగారు బాగున్నారా’, వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ‘శంకర్దాదా ఎంబీబీఎస్’తో లింగం మావయ్యగా పరేశ్ తెలుగువారికి మరింత చేరువయ్యారు. మరోవైపు మార్చి నెలలో ఆయన కొవిడ్-19 బారినపడ్డారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ అప్పట్లో ట్వీట్ పెట్టారు. హోమ్ ఐసోలేషన్లో ఉండి.. వైద్యుల సూచనలు పాటించి కరోనా నుంచి కోలుకున్నట్లు ఏప్రిల్లో ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు