Ginna: విష్ణు ‘జిన్నా’ విషయంలో ఆ తప్పులు సరిచేసుకుని ఉంటే..: పరుచూరి గోపాలకృష్ణ
మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. ఆ సినిమాలోని లోపాలను వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: తన యూట్యూబ్ ఛానల్ వేదికగా సినిమాల్లోని మంచీ చెడుల గురించి ప్రేక్షకులకు పాఠాలు చెబుతుంటారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna). అందులో భాగంగా తాజాగా ‘జిన్నా’ (Ginna) చిత్రం గురించి విశ్లేషించారు. మంచు విష్ణు (Vishnu Manchu), పాయల్ రాజ్పూత్ (Payal Rajput), సన్నీలియోనీ (Sunny Leone) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. గతేడాది అక్టోబరులో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఎందుకు విజయం అందుకోలేకపోయిందో గోపాలకృష్ణ మాటల్లోనే..
‘‘జిన్నా’ అనే టైటిల్ వినగానే అది హీరో ఓరియెంటెడ్ కథ అని అందరికీ అనిపిస్తుంది. దర్శకుడు ఇషాన్ సూర్య, మోహన్బాబు, కోన వెంకట్, జి. నాగేశ్వర్రెడ్డి ఈ సినిమా రచనలో భాగమయ్యారు. ఈ చిత్ర కథా మూలానికి వెళ్తే ‘మనసంతా నువ్వే’లా ఉంటుంది. మాటలురాని హీరోయిన్ని (బాల్యంలో) నువ్వు ఎక్కడ కూర్చుంటావ్? అని అడిగితే వెళ్లి హీరో పక్కన కూర్చొంటుంది. ఆ అమ్మాయి మాట్లాడలేదు కాబట్టి కుటుంబ సభ్యులు ఓ విజిల్ ఇస్తారు. విజిల్ ఎప్పుడైతే వేసిందో ఆమెకు ఏదో అవసరం ఉందని వారు గుర్తిస్తారు. కొన్నాళ్లకు ఆ అమ్మాయి విదేశాలకు వెళ్తుంది. అప్పుడు.. హీరో కూడా విదేశాలకు వెళ్తాడా? హీరోయిన్ స్వదేశానికి తిరిగొచ్చినప్పుడు వారి మధ్య ప్రేమ మళ్లీ చిగురిస్తుందా? అనే సందేహం ప్రేక్షకులకు కలుగుతుంది’’
మల్లీశ్వరి తరహా కాన్సెప్ట్..
‘‘ఇందులోని హీరోని కబడ్డీ సన్నివేశంతో పరిచయం చేశారు. అతను స్వగ్రామంలో టెంట్ హౌస్ నడిపిస్తుంటాడు. చావులకు మాత్రమే టెంట్ సామాన్లు రెంట్కు ఇవ్వాలని హీరో మామయ్య తీర్మానిస్తాడు. దాంతో, కథానాయకుడిని ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. వాటి నుంచి ఆయన ఎలా బయటపడతాడో అని ప్రేక్షకులు అనుకుంటున్నప్పుడు.. ఎవరినైతే హీరో బాల్యంలో ఇష్టపడ్డాడో ఆ అమ్మాయి ఊరికి వచ్చి, ఆదుకుంటుంది. కానీ, అప్పటికే హీరో మరో అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. ఇదే కాన్సెప్ట్ నాటి చిత్రం ‘మల్లీశ్వరి’లో కనిపిస్తుంది. దానికి అవార్డులు వచ్చాయి తప్ప డబ్బులు రాలేదు’’
కథలో లోపం లేదు కానీ..
‘‘చిన్నప్పుడు హీరోని ప్రేమించిన అమ్మాయి ఎప్పుడైతే ఊరికి తిరిగి వస్తుందో అప్పుడు.. ‘ఇకపై లవ్స్టోరీ మొదలవుతుంది. కామెడీ కూడా ఉండబోతోంది’ అని ప్రేక్షకులు ఆశిస్తారు. రేణుకగా వచ్చిన ఆ హీరోయిన్.. నరేశ్ పాత్రను చంపేయడంతో స్టోరీ డెడ్లాక్ అయిపోయింది. మర్డర్ చేయడంతో ఆ కథానాయిక పాత్ర ప్రేక్షకుల హృదయాల్లోంచి బయటకు వెళ్లిపోతుంది. అక్కడ నరేశ్ పాత్రను చంపేయడమేకాకుండా మరో విధంగా చూపించి ఉంటే బాగుండేది. రేణుక హీరోని ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించగా ‘మనది స్వచ్ఛమైన ప్రేమ అనుకున్నా. డర్టీ లవ్ అనుకుంటే కానీ’ అని హీరో చెప్పే సంభాషణ అద్భుతమైంది. అలా చెప్పించి విష్ణు పాత్రను కాపాడారు. ఒకవేళ ఆ హీరోయిన్ విష్ణుని ముద్దుపెట్టుకుని ఉంటే చాలా లోపం కనిపించేది. ఈ సినిమాపై విష్ణు ఆశలు పెట్టుకుని ఉండి ఉంటాడు. ఈ చిత్ర కథనంలో లోపం ఉందిగానీ కథలో లేదు. ఒక అబ్బాయిని ఇద్దరో ముగ్గురో అమ్మాయిలు ప్రేమించడం, అతను ఒక అమ్మాయినే కోరుకోవడమనేది చాలా సినిమాల్లో కనిపిస్తుంది. కానీ, బాల్యంలో ప్రేమించిన అమ్మాయి స్థానంలో డూప్గా మరో అమ్మాయిని పెట్టి కథను నడిపించాలనే ఆలోచన ప్రమాదకరమైంది. దానికి తగ్గ స్క్రీన్ప్లేను ఈ చిత్రంలో ఆలస్యంగా రివీల్ చేశారు. ఆ డూప్ పాత్రను ముందే చూపించి ఉంటే ‘హీరో ఆ అమ్మాయి వలలో పడిపోతాడేమో. అలా జరగకూడదు’ అని ప్రేక్షకులకు ఉత్కంఠకు గురయ్యేవారు’’
అలా చెప్పడం ప్రమాదకరం..
సస్పెన్స్, సెంటిమెంట్ ఒకేసారి పండవనే విషయం ఈ చిత్రంతో స్పష్టమైంది. రేణుకగా ప్రవేశించిన అమ్మాయి నకిలీ అనే సస్పెన్స్ను చివరి వరకు దాచిపెట్టడం, ఆమె ఫ్లాష్బ్యాక్ చెప్పడం, అందులోనూ తను హత్య చేసినట్టు చూపించడంతో.. తను హీరోని పెళ్లి చేసుకుని ఎలా ఉండగలదనే ప్రశ్న ఆడియన్స్కు తప్పక వస్తుంది. విదేశాల నుంచి వచ్చిన అమ్మాయి రేణుకే అని చెప్పి ఉంటే మరోలా ఉండేది. అసలు రేణుకగా వచ్చిన అమ్మాయికి హీరో అంటే ఎందుకంత ప్రేమ కలిగింది? అనే సందేహమూ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు హీరో స్నేహితురాలని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ‘నాలుగు రోజులు నాటకం ఆడదాం. ఆ అమ్మాయి (రేణుక) దగ్గర డబ్బులు తీసుకుందాం. నిన్ను పెళ్లి చేసుకుంటా’ అని చెబుతాడు. దాంతో, హీరో క్యారెక్టరైజేషన్ స్థాయి పడిపోయింది. మరో సన్నివేశంలో ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెడితేనే గెలుస్తారనే దాన్ని ప్రకటించడం ప్రమాదకరమైన చర్య. హీరో అంటే పైసా ఖర్చు పెట్టకుండా గెలవాలి. కథ రాసుకునే సమయంలోనే ఇలాంటి చిన్న చిన్న తప్పులను సరిచేసుకుని ఉండి ఉంటే బాగుండేది. దర్శక, నిర్మాతలు తమ లక్ష్యాన్ని చేరుకోలేదని అర్థమైంది’’ అని గోపాలకృష్ణ వివరించారు. టైటిల్ పాత్రలో విష్ణు కనిపించగా స్వాతి పాత్రలో పాయల్ సందడి చేశారు. ఫేక్ రేణుకగా సన్నీ లియోనీ నటిస్తే అసలైన రేణుకగా దివి మెరిశారు. ఈ సినిమా ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్చరణ్ బర్త్డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.