‘గుండమ్మకథ’ విడుదల చేయడానికి భయపడ్డారు!
‘గుండమ్మకథ’ విడుదల చేయడానికి విజయావారు భయపడ్డారు
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో యూట్యూబ్ వేదికగా తన అనుభవాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అలనాటి దిగ్గజ సినీ రచయిత డి.వి. నరసరాజు గురించి పలు విషయాలు పంచుకున్నారు. తెలుగు సినిమా రచయితల సంఘానికి ఆయనో భీష్మాచార్యుడని అన్నారు. రచయితలకు ఓ సంఘం ఉండాలని పట్టుబట్టి, పోరాడి మద్రాసులోనే తెలుగు సినీ రచయితల సంఘాన్ని పెట్టించారని తెలిపారు. ఇంకా డి.వి.నరసరాజు గురించి పరుచూరి ఏం చెప్పారంటే..
ఎందుకు భీష్మాచార్యులు అంటున్నానంటే..
‘‘నేను ఫస్ట్ ఫారంలో కూడా చేరకముందే ఆయన చిత్రాలు చూశా. ‘పెద్ద మనుషులు’, ‘దొంగరాముడు’.. ఇలా ఆయన సినిమాలన్నీ నిక్కర్లు వేసుకున్న రోజుల్లోనే చూశా. రచయితల సంఘం పెట్టినప్పుడు.. ఫిలింనగర్లో ఆఫీస్ ఉండేది కాదు. అందరూ చెట్టుకింద కూర్చొనేవారు. అలాంటి పరిస్థితుల్లో రచయితల సంఘాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లారు. సాధారణంగా కథలను ఆఫీసుల్లో కంటే గెస్టు హౌసుల్లో కూర్చొని రాసేవారు. ఆయన మాత్రం ఏనాడూ హోటల్ రూమ్ బుక్ చేయించుకోలేదు. అలా ఎప్పుడూ కథలు రాయలేదు. ఇది ఆయన గొప్పదనం’’
‘గుండమ్మకథ’ని మళ్లీ తీద్దామనుకున్నాం..
‘‘ఆయన సినిమాల్లో ముఖ్యమైనది ‘గుండమ్మకథ’. అయితే ఇందులో ఎన్టీఆర్ నిక్కర్తో కనిపిస్తారు. సినిమాను అలాగే విడుదల చేస్తే ప్రజలు కొడతారని విజయావారు భయపడ్డారు. అయితే, విజయావారి ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. దానికి వచ్చిన బంధువులకు ప్రత్యేకంగా తమ సొంత థియేటర్లో ఈ సినిమా వేశారు. సినిమా చూసి అందరూ పడీపడీ నవ్వారు. అది చూశాక విజయావారికి ధైర్యం వచ్చింది. అప్పుడు సినిమాను రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు చూసినా, ఎంతగానో అలరిస్తుంది. ‘గుండమ్మకథ’ చిత్రాన్ని మళ్లీ బాలకృష్ణ, నాగార్జునతో తీద్దామనుకున్నాం. బాలకృష్ణతో ఈ విషయం గురించి మాట్లాడాను కూడా. ‘మళ్లీ మాతో తీస్తే చూస్తారా?’ అని అన్నారు. ఆయన అలా అనేసరికి ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు’’
ఆ సినిమా చూడటానికి వేరే ఊరు వెళ్లా..
‘‘రాముడు భీముడు’ చిత్రం విడుదల సమయానికి నేను నూజివీడులో ఉన్నా. అక్కడ ఆ సినిమా షో వేయకపోవడంతో కేవలం రామారావుగారి కోసం ప్రత్యేకంగా గుడివాడకి సైకిల్ మీద వెళ్లి.. ఒకే రోజు రెండు సార్లు చూశా. అసలు ఆ కథ ఎలా పుట్టిందంటే.. రామానాయుడు గారికి నరసరాజుగారు రెండు మూడు కథలు చెప్పినా నచ్చలేదట. అప్పుడు నరసరాజుగారు ‘అందరూ వద్దన్న కథ ఒకటి నా దగ్గర ఉంది చెప్పనా’ అంటే ‘సరే చెప్పండి’ అన్నారట రామానాయుడు. అదే ‘రాముడు- భీముడు’. రామానాయుడిగారికి కథ నచ్చడంతో వెంటనే తీద్దామన్నారు. అయితే ఆ కథను అందరూ నిరాకరించారన్న విషయాన్ని ఎన్టీఆర్కి చెప్పొద్దని నరసరాజుగారు రామానాయుడు గారిని కోరారట. కథ విన్న అన్నగారు ‘చాలా బాగుంది’ అని ఆ సినిమా చేశారట. ఆ తర్వాత ఈ కథా నేపథ్యంతో ఎంతమంది, ఎన్ని సినిమాలు తీశారో అందరికీ తెలిసిందే. ‘బడిపంతులు’ సినిమా చూస్తూ థియేటర్లోనే ఏడ్చేశా. అందులో ఎన్టీఆర్ కాకుండా కేవలం బడిపంతుల్నే చూశా. దానికి ఎన్టీఆర్ నటనతో పాటు డి.వి. నరసరాజు గారి కలం బలం కూడా తోడైంది. అలా దర్శకుడు, నటుడు, రచయిత కలిస్తే, అద్భుతాలు చేయొచ్చు.
నిరంతం పనిచేయాలని చెప్పేవారు..
‘‘మనల్ని ఎవరైనా వద్దనుకునే రోజు వరకూ పనిచేయాలి’ తప్ప ఒక రచయితగా ఎప్పుడూ రిటైర్మెంట్ ప్రకటించకూడదు’ అని నరసరాజుగారు చెప్పేవారు. ఆ మాట ఈరోజుకీ ఆదర్శం. తన కలం బలంలో హీరో పాత్రలకి జీవం పోసిన మహానుభావులు ఆయన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్గుడ్ స్టోరీ.. పవన్ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్దత్ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ