Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రామ్చరణ్ (RamCharan) ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రానికి ‘ఆచార్య’ (Acharya) అనే టైటిల్ పెట్టకుండా ఉండుంటే బాగుండేదని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ....
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రామ్చరణ్ (RamCharan) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి ‘ఆచార్య’ (Acharya) అనే టైటిల్ పెట్టకుండా ఉండుంటే బాగుండేదని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) అన్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన సోషల్మీడియా వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ఆచార్య’ సాగిన తీరు తాను రచించిన ‘మరో మలుపు’ (Maro Malupu) కోవలో ఉందన్నారు.
‘‘ఆచార్య’ చూస్తున్నప్పుడు ‘మరో మలుపు’ గుర్తుకు వచ్చింది. ‘మరో మలుపు’ వెళ్లిన దారిలోనే ఈ సినిమా సాగిందనిపించింది. 1980లో ఎన్నో ఎర్ర సినిమాలు వచ్చాయి. ఎంతగానో ఆడాయి. ఒక దశకు వచ్చాక ఎర్ర సినిమాలు రాయడం రచయితలు మానేశారు. తీయడం దర్శకులూ మానేశారు. ఇలాంటి ఈ సమయంలో ఒక ఎర్ర సినిమాని తీయాలని, మంచి పాయింట్ని ప్రేక్షకులకు అందించాలని కొరటాల శివకు కోరిక పుట్టడం, దానికి చిరు అంగీకరించడంతో ‘ఆచార్య’ రూపుదిద్దుకుంది’’
‘‘సినిమాగా చూస్తే ఇందులో తప్పు ఏమీ లేదు. కానీ, కథలో ముఖ్యమైన సంఘటన.. ఎందుకు జరిగింది?ఏం జరిగింది?అనేది చెప్పకుండా కథను నడిపించిన తీరు ప్రేక్షకుడిని అయోమయంలో పడేసింది. సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే చోట ఇమడవు. రామ్చరణ్ పోషించిన సిద్ధ పాత్ర ఫస్టాప్లోనే వచ్చుంటే బాగుండేది. ఆ పాత్రను మొత్తంగా కాకపోయినా కొంతైనా అక్కడ చూపించి ఉండుంటే ఇంకోలా ఉండేది. డైలాగ్లు, కథాంశం, పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో కమ్యూనిజం భావజాలం ఉన్న సినిమాలు ప్రేక్షకులకు అంతగా నప్పడం లేదు’’
‘‘చివరిగా.. రామ్చరణ్ చేత ‘సిద్ధ’ పాత్ర చేయించకుండా ఉంటేనే బాగుండేదేమో. ఫ్లాష్బ్యాక్ కేవలం 10 శాతం ఉంచి, చిరు స్టోరీ 90 శాతం ఉండుంటే ఈ కథ రిజల్ట్ మరోలా ఉండేది. సంగీతం సరిగ్గా కుదరలేదు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పాత్రలో చిరు స్టెప్పులు వేయకుండా ఉంటే బాగుండేది. ఈ చిత్రానికి ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు అనిపించింది’’ అని పరిచూరి గోపాలకృష్ణ వివరించారు.
నక్సలిజం బ్యాక్డ్రాప్లో సిద్ధమైన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఇందులో చిరంజీవి ‘ఆచార్య’గా, రామ్చరణ్.. ‘సిద్ధ’గా నటించారు. పూజాహెగ్డే కథానాయిక. సోనూసూద్ కీలకపాత్ర పోషించారు. వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.