F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varuntej), తమన్నా (Tamannaah), మెహ్రీన్ (Mehreen) ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ‘ఎఫ్-3’పై (F3) తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala krishna). ‘ఎఫ్-2’తో పోలిస్తే....
సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టిన రచయిత
హైదరాబాద్: వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varuntej), తమన్నా (Tamannaah), మెహ్రీన్ (Mehreen) ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ‘ఎఫ్-3’పై (F3) తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala krishna). ‘ఎఫ్-2’తో పోలిస్తే ‘ఎఫ్-3’ అంత బాలేదని ఆయన తెలిపారు. గతంలో తాము చేసిన తప్పే ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేశారా? అన్న అనుమానం తనకు కలిగిందని అన్నారు. ఈ మేరకు ‘ఎఫ్-3’పై తన మనసులోని మాట బయటపెడుతూ ‘పరుచూరి పలుకులు’ వేదికగా తాజాగా ఆయన వీడియో షేర్ చేశారు.
‘‘ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ఎఫ్-2’ చూసిన కళ్లతో ‘ఎఫ్-3’ చూస్తే ఈ సినిమా అంత బాలేదనిపించింది. కలెక్షన్స్ పరంగా చూసుకున్నా.. ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు రాలేదనే అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకూ ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒకవేళ ఇదే చిత్రం కనుక దాదాపు రూ.250 కోట్లు వసూళ్లు చేస్తే ‘ఎఫ్-2’తో సమానమై ఉండేది. ‘ఎఫ్-2’ అంత విజయం సాధించడానికి కారణం అది అందరికీ ఆసక్తి ఉన్న అంశం. భార్యాభర్తలిద్దరిలో ఎవరి పెత్తనం ఇంట్లో కొనసాగాలి? అనే టాపిక్పై ఆ చిత్రాన్ని రూపొందించారు. మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న గొడవలను చూపించారు. దానివల్ల ప్రతి ఒక్కరూ ‘ఎఫ్-2’కి కనెక్ట్ అయిపోయారు. అందుకే ఆ సినిమా అందరి హృదయాలకు చేరువైంది. అనిల్ రావిపూడికి మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. రైటర్, స్క్రీన్ప్లే, దర్శకుడిగా ఆయన విజయం సాధించాడు’’
‘‘ఇటీవల నేను ‘ఎఫ్-3’ చూశా. గతంలో ‘శ్రీ కట్న లీలలు’లో మేము చేసిన పొరపాటే అనిల్ రావిపూడి ఈ సినిమాలోని సెకండాఫ్లో చేశారనే అనుమానం నాకు కలిగింది. ప్రాథమికంగా చూసుకుంటే సెకండాఫ్కి వచ్చేసరికి కథ పట్టాలు తప్పింది. ఒక చీటింగ్ డ్రామాని దాదాపు 40 నిమిషాలు నడిపారు. చిన్నప్పుడు తప్పిపోయిన తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నానని, ఆ కొడుక్కి ఇప్పుడు సుమారు 20 ఏళ్లు ఉంటాయని మురళీ శర్మ ప్రకటించడం.. అది చూసి, డబ్బు కోసం తానే కొడుకునంటూ వెంకటేశ్ వెళ్లినట్టు సినిమాలో చూపించారు. వెంకీ వయసు మనందరికీ తెలుసు. ఆయన్ని ఇరవైయేళ్ల కొడుకు పాత్రలో చూపించడం అంతగా అతికినట్లు అనిపించలేదు. మేము వెంకీకి ఎన్నో సినిమాలు రాశాం. ఏ కాస్త లాజిక్ మిస్సైనా ఆయన అస్సలు ఒప్పుకోరు. అలాంటిది ఈ పాత్ర ఎలా ఓకే చేశారో అర్థం కావడం లేదు. అదే విధంగా తమన్నాకు మీసాలు పెట్టి ఒక అబ్బాయిలా చూపించడం, తాము కూడా కొడుకులమేనంటూ వెన్నెలకిషోర్, వరుణ్ తేజ్ అక్కడికి రావడం... ఇలా సెకండాఫ్లో వచ్చే సీన్స్ అన్నీ అర్థంపర్థం లేని కామెడీలా అనిపించాయి’’
‘‘సెకండాఫ్లోని 40 నిమిషాలు ఇలా కాకుండా వేరేలా చూపించి ఉండుంటే సినిమా మరోలా ఉండేదని నా భావన. సినిమా చివర్లో వరుణ్తేజే.. మురళీ శర్మ వారసుడని, వెంకీ, తమన్నా, రాజేంద్రప్రసాద్.. ఇతర పాత్రధారులందరూ చెబుతారు కదా. అదే సీన్ని మెయిన్ పాయింట్గా తీసుకుని వరుణ్ని మురళీ శర్మ వారసుడిగా నిరూపించేందుకు వాళ్లందరూ నానా తంటాలు పడుతున్నట్లు కనుక డ్రామా నడిపి ఉంటే బాగుండేదనిపించింది.’’
‘‘అలాగే డబ్బు ఉంటే సుఖంగా జీవించవచ్చు అనేది నిజం కాదు. ఇది ప్రాథమిక సూత్రం. కాబట్టి, డబ్బుంటేనే సంతోషంగా జీవించగలమని చూపించకుండా ఉండాల్సింది. సినిమా ప్రారంభంలో సునీల్ని కత్తితో పొడిచినట్లు చూపిస్తారు. కట్ చేస్తే ఫస్ట్ సాంగ్లో అతడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అదెలా సాధ్యం. తన కుటుంబం మొత్తం హోటల్ నడుపుకొంటూ ఉంటుంటే మెహ్రీన్ మాత్రం వేరే ఇంట్లో పనిమనిషిగా వర్క్ చేయడం కూడా అంతగా నప్పలేదు. ఎన్నో తప్పులున్నప్పటికీ ఈ సినిమా బతికిందంటే అది కేవలం చివరి 20 నిమిషాల వల్లే. హీరో అంటే ఏదైనా చేయగలడు అని నిరూపించాలి తప్ప.. అతడికి ఏం చేతకాదు అనిపించుకోకూడదు. చివరి 20 నిమిషాల్లో వరుణ్ తేజ్, వెంకటేశ్ పాత్రలను రియల్ హీరోలుగా దర్శకుడు చూపించాడు కాబట్టే ఆ సినిమా నిలబడిందని నా ఉద్దేశం. ఫైనల్గా ‘ఎఫ్-2’లో మాదిరిగా ఈ సినిమాలో మనసుని హత్తుకునే డ్రామా లేదు’’ అని పరుచూరి చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
‘కాంతార 2’ హీరోయిన్పై చిత్ర పరిశ్రమలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? -
Arundhathi Nair: ప్రమాదంలో హీరోయిన్కు తీవ్ర గాయాలు.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు
మలయాళ హీరోయిన్ అరుంధతీ నాయర్ తీవ్ర గాయాల పాలయ్యారు. -
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) ‘శక్తిమాన్’ పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తోన్న వార్తలపై ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేశ్ ఖన్నా స్పందించారు. -
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ
తాను క్షేమంగానే ఉన్నానని సింగర్ మంగ్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. -
Prithiveeraj: పృథ్వీరాజ్తో పెళ్లి జరగలేదు.. మేమిద్దరం విడిపోయాం: శీతల్ పోస్ట్
నటుడు పృథ్వీరాజ్తో తనకు పెళ్లి జరగలేదని శీతల్ తెలిపింది. ఈమేరకు ఆమె ఓ పోస్ట్ పెట్టింది. -
Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన గాయని హారికా నారాయణ్
యువ గాయని హారికా నారాయణ్ పెళ్లి వేడుకగా జరిగింది. -
Elvish Yadav: పాము విషం ఏర్పాటు చేశా.. కీలక విషయాలు వెల్లడించిన బిగ్బాస్ ఓటీటీ విజేత..!
పాము విషంతో రేవ్పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్లో ఉన్నారు యూట్యూబర్, బిగ్బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్. విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. -
Tharun Bhascker: ‘కీడాకోలా’లో ఎస్పీ బాలు పాట.. లీగల్ నోటీసులపై తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే!
‘కీడా కోలా’ (Keedaa Cola)లో ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంతో నెలకొన్న వివాదంపై చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్పందించారు. -
Meetha Raghunath: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ‘గుడ్నైట్’ స్టార్
రకుల్ ప్రీత్ సింగ్, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది. -
Aadujeevitham: ఆ పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను: పృథ్వీరాజ్ సుకుమారన్
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
Social Look: అమృత ‘పాజిటివ్’ పోస్ట్.. అనుపమ సెల్ఫీ.. ప్రియాంకా చోప్రా న్యూ లుక్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Ileana: నన్ను అంటే పడ్డా.. కానీ, అతడిని విమర్శిస్తే నేను తట్టుకోలేను: ఇలియానా
తన భాగస్వామి మైఖేల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి ఇలియానా (Ileana). అతడు తనని ఎంతో గౌరవమిస్తాడన్నారు. -
Vicky Kaushal: ఆ సినిమా విడుదల టెస్ట్ మ్యాచ్ అవుతుందని ముందే తెలుసు: విక్కీకౌశల్
బాలీవుడ్ నటుడు విక్కీకౌశల్ తన సినిమా ‘సామ్ బహదూర్’ బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్న పోటీ గురించి మాట్లాడారు. -
Kriti Sanon: ఆ సినిమా కోసం రోజుకు 17 గంటలు పనిచేశా: కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ నిర్మాతగా రోజుకు 17 గంటలు పనిచేశానని తెలిపారు. -
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ దర్శకుడి రియాక్షన్
‘యానిమల్’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన్ను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. -
Bhoomi Shetty: ఇంట్లోవాళ్లు నాతో ఆరేళ్లు మాట్లాడలేదు.. హేళన చేశారు: భూమి శెట్టి
‘షరతులు వర్తిస్తాయి’తో నటిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ భూమిశెట్టి (Bhoomi Shetty). సహజమైన నటనతో తెలుగువారిని మెప్పించారామె. -
Social Look: ‘ఫ్యామిలీ స్టార్’ షూట్ పూర్తి.. రేంజ్ రోవర్ కొన్న హీరో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Vijay Antony: డిప్రెషన్.. విజయ్ ఆంటోనీ ఏమన్నారంటే..?
తన తదుపరి చిత్రం ‘రోమియో’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). తెలుగులో ఇదే చిత్రాన్ని ‘లవ్ గురు’ పేరుతో విడుదల చేయనున్నారు. -
vishnu vishal: ఆ సినిమా విడుదల నిర్మాతల నిర్ణయం: విష్ణు విశాల్
‘పొన్ ఒండ్రు కండేన్’ సినిమాపై ఎక్స్లో ట్వీట్ చేశారు. -
Manchu Vishnu: కన్నప్ప కథ.. కామిక్ బుక్ విడుదల చేయనున్న మంచు విష్ణు
‘కన్నప్ప’తో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). ఇటీవల విడుదల చేసిన ఆ సినిమా ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య