Pathaan: ‘పఠాన్‌’ డే స్పెషల్‌.. రూ. 110కే మల్టీప్లెక్స్‌లో టికెట్‌.. పాప్‌కార్న్‌ ఫ్రీగా ఇవ్వగలరా!’

షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిన సినిమా ‘పఠాన్‌’. రూ. 110కే మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూసేలా ప్రేక్షకులకు చిత్రబృందం ఆఫర్‌ ప్రకటించింది.

Published : 16 Feb 2023 19:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంతకాలంగా పరాజయాలు చవిచూస్తున్న బాలీవుడ్‌కు మంచి విజయాన్ని అందించిన చిత్రం ‘పఠాన్‌’ (Pathaan). షారుక్ ఖాన్‌ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్‌ అబ్రహం (John Abraham) ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన సినిమా ఇది. జనవరి 25న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 970 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. ఇండియాలో రూ. 500 కోట్లకుపైగా (నెట్‌) వసూళ్లు చేసిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసిన చిత్రబృందం ప్రేక్షకులకు ఓ ఆఫర్‌ ప్రకటించింది. ఈ శుక్రవారాన్ని (ఫిబ్రవరి 17) ‘పఠాన్‌ డే’గా అభివర్ణించిన టీమ్‌.. ఆ ఒక్కరోజు ఐనాక్స్‌, పీవీఆర్‌, సినీపోలిస్‌తోపాటు మరికొన్ని మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ. 110గా ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. దీనిపై షారుక్‌ స్పందిస్తూ.. ‘‘అవునా.. అయితే చూడాల్సిందే. ఎంత మంచి విషయమిది. దీంతోపాటు పాప్‌కార్న్‌ ఫ్రీగా ఇవ్వగలరా!’’ అని చిత్ర నిర్మాతను సరదాగా అడిగారు.

‘బేషరమ్‌ రంగ్‌’ పాట విషయంలో ఈ చిత్రం కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలా వివాదాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు