Chiranjeevi: ‘ఆచార్య’ కోసం పవన్, రాజమౌళి?
చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’(Acharya). రామ్చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు
ఇంటర్నెట్డెస్క్: చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’(Acharya). రామ్చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్, పూజా హెగ్డే కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 23న ప్రీరిలీజ్ వేడుక నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ప్రీరిలీజ్ వేడుక విజయవాడలో నిర్వహిస్తారని, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారంటూ వార్తలు వచ్చాయి. కానీ, చివరకు హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహిస్తున్న చిత్ర బృందం ప్రకటించింది. మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎవరు వస్తారన్న ఆసక్తి నెలకొంది. తొలిసారి చిరంజీవి, రామ్చరణ్ కలిసి పూర్తి స్థాయిలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ వేడుకకు పవన్ కల్యాణ్ వస్తే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. అంతేకాదు, అగ్ర దర్శకుడు రాజమౌళిని కూడా అతిథిగా పిలవాలని భావిస్తున్నారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల విడుదల చేసిన ‘ఆచార్య’ ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు