Bheemla Nayak: ఏపీ మంత్రులు కొడాలి, పేర్ని నానిలకు నిరసన సెగ

ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్‌ కల్యాణ్ అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది.

Updated : 25 Feb 2022 12:14 IST

గుడివాడ: ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్‌ కల్యాణ్ అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది. ‘భీమ్లా నాయక్‌’ సినిమా ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై ఇప్పటికే పవన్‌ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో ఓ థియేటర్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులను అడ్డుకునేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు యత్నించారు. జై పవన్‌ కల్యాణ్‌, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. మంత్రులను అడ్డుకునేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో పవన్‌ సినిమాను కక్షపూరితంగా అడ్డుకోవడం దారుణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానికి వినతిపత్రం అందించేందుకు వచ్చిన తమను అరెస్ట్‌ చేయడమేంటని మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని