పవన్‌-మహేశ్‌ మొదలు పెట్టేశారు..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తమ తదుపరి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేశారు. ఈ మేరకు వీరిద్దరి కొత్త సినిమాల షూటింగ్స్‌ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయా చిత్రబృందాలు సోషల్‌మీడియా

Published : 25 Jan 2021 12:16 IST

అప్‌డేట్‌ షేర్‌ చేసిన చిత్ర బృందాలు

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తమ తదుపరి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేశారు. ఈ మేరకు వీరి కొత్త సినిమాల షూటింగ్స్‌ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయా చిత్రబృందాలు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.

హైదరాబాద్‌లో పవన్‌..
పవన్‌కల్యాణ్‌-రానా ప్రధాన పాత్రల్లో మలయాళీ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో పవన్‌కల్యాణ్‌ పాల్గొంటున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు.

దుబాయ్‌లో మహేశ్‌..
‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌ నటించనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. దీని చిత్రీకరణ సోమవారం దుబాయ్‌లో ప్రారంభమైంది. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. షూట్‌ ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా ఓ ప్రత్యేక‌ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

ఇవీ చదవండి!

చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు

ఫిబ్రవరి 26న వస్తున్న ‘అక్షర’



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని