వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్?
పవన్ కల్యాణ్ న్యాయవాదిగా ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దిల్రాజ్ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. పవన్ కల్యాణ్ మరోసారి దిల్రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ మరోసారి దిల్రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వైవిధ్యమైన చిత్రాలను తీయడంలో దిల్రాజు ముందుంటారు. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఆయనకు ఓ కథను వినిపించారట. ఆ కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కరోనా నుంచి కోలుకోగానే వంశీ ఈ కథను వినిపించునున్నారట. పవన్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ చిత్రం ‘అయప్పనుమ్ కోషియం’ రీమేక్లోనూ నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తారు. ఈ చిత్రాలు పూర్తికాగానే దిల్రాజు- వంశీ- పవన్ల చిత్రం లైన్లోకి వచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె