Payal ghosh: నాపై యాసిడ్‌ దాడికి యత్నించారు.. భయంగా ఉంది: పాయల్‌ ఘోష్‌

గుర్తు తెలియని వ్యక్తులు తనపై యాసిడ్‌ దాడికి విఫలయత్నం చేశారని నటి పాయల్‌ ఘోష్‌ తెలిపారు. ఇన్‌స్టా వేదికగా చేతికి గాయాలైన ఫొటోను షేర్‌ చేసిన ఆమె తనపై దాడికి పాల్పడ్డారని అన్నారు...

Published : 21 Sep 2021 14:00 IST

ముంబయి: గుర్తు తెలియని వ్యక్తులు తనపై యాసిడ్‌ దాడికి విఫలయత్నం చేశారని నటి పాయల్‌ ఘోష్‌ తెలిపారు. చేతికి గాయాలైన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది.  ‘ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందులు తీసుకువద్దామని చాలా రోజుల తర్వాత బయటకు వెళ్లాను. నా పనులన్ని పూర్తి చేసుకుని కారు ఎక్కుతుంటే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి.. నాపై దాడి చేశారు. ఆ సమయంలో నా చేతికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ల చేతుల్లో యాసిడ్‌ బాటిల్స్ ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే సాయం కోరుతూ గట్టిగా కేకలు వేశాను. దాంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సంఘటన తర్వాత ప్రతి క్షణం నాకు భయమేస్తోంది. దానిని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంది’ అని పాయల్‌ వివరించారు.

‘ప్రయాణం’తో కథానాయికగా తెలుగువారికి పరిచయమైన పాయల్‌.. ‘ఉసరవెల్లి’లో సహాయనటిగానూ రాణించారు. అనుకున్నంతలో విజయాన్ని అందుకోలేకపోవడంతో ‘పటేల్‌ కీ పంజాబీ షాదీ’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. మరోవైపు గతేడాది ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై పాయల్‌ మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని