Payal Ghosh: బాలీవుడ్‌ను టాలీవుడ్‌ బీట్‌ చేయడం ఖాయం: పాయల్‌ ఘోష్‌

‘బాహుబలి’ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి మరో స్థాయికి చేరింది. అప్పటివరకూ టాలీవుడ్‌, దక్షిణాది చిత్రపరిశ్రమపై చిన్నచూపుగా వ్యవహరించే బాలీవుడ్‌ నటీనటులు ఇప్పుడు తెలుగు హీరోలు, దర్శకులతో...

Updated : 12 Feb 2022 12:15 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి మరో స్థాయికి చేరింది. అప్పటివరకూ టాలీవుడ్‌, దక్షిణాది చిత్రపరిశ్రమపై చిన్నచూపుగా వ్యవహరించే బాలీవుడ్‌ నటీనటులు ఇప్పుడు తెలుగు హీరోలు, దర్శకులతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగు హీరోలంటే తమకు అభిమానమంటూ, అవకాశం వస్తే వాళ్లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటామని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై ‘ఊసరవెల్లి’ నటి పాయల్‌ ఘోష్‌ స్పందించారు. ఆమె కూడా ఎన్టీఆర్‌ను కొనియాడుతూనే.. బాలీవుడ్‌పై విరుచుకుపడ్డారు.

‘‘బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ తారక్‌తో కలిసి వర్క్‌ చేసేందుకు ఇప్పుడు వరుస కడుతున్నారు. ‘ఊసరవెల్లి’ కోసం నేను ఇప్పటికే ఆయనతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. బాలీవుడ్‌లో మా సినిమా ఎలాంటి ఖ్యాతి సొంతం చేసుకుంటుందో 2020లో ట్వీట్‌ చేశా. దానికి పలువురు నన్ను విమర్శించారు. కానీ ఇప్పుడు మరోసారి చెబుతున్నా దక్షిణాది చిత్రపరిశ్రమ త్వరలోనే బాలీవుడ్‌ని కైవసం చేసుకుంటుంది. అసభ్యకరమైన సన్నివేశాలు, మాటల్ని ఇకనైనా సినిమాల్లో చూపించడం మానకపోతే బాలీవుడ్‌ అంతం కాక తప్పదు’’ అని పాయల్‌ ట్వీట్స్‌ చేశారు. తన మాటలు నిజమౌతాయని ఆమె అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని