నీ పవర్‌ ఇప్పుడు వాడు: మంచు లక్ష్మి

‘నీకున్న పవర్‌ ఇప్పుడు వాడాలే. నేను చెప్పినట్టు విను.’ అంటున్నారు మంచు లక్ష్మి. బాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ మెండుగా పొందిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ సిరీస్‌ను తెలుగులోకి ‘పిట్టకథలు’ పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. మరికొన్నిరోజుల్లో ప్రముఖ ఓటీటీ...

Updated : 05 Feb 2021 12:25 IST

హైదరాబాద్‌: ‘నీకున్న పవర్‌ ఇప్పుడు వాడాలే. నేను చెప్పినట్టు విను’ అంటున్నారు మంచు లక్ష్మి. బాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ సిరీస్‌ను తెలుగులోకి ‘పిట్టకథలు’ పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

‘ఆమె మనసులో మాట అతనికి తెలుసా? తెలీదా? తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా?’ అంటూ ప్రారంభమైన ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్‌లోని నాలుగు కథలను నలుగురు దర్శకులు తరుణ్‌ భాస్కర్‌, నాగ్‌ అశ్విన్‌, సంకల్ప్‌ రెడ్డి, నందినీరెడ్డి రూపొందించారు. శ్రుతిహాసన్‌, అమలాపాల్‌, ఈషారెబ్బా, శాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో జగపతిబాబు, సత్యదేవ్, మంచులక్ష్మి కీలకపాత్రలు పోషించారు. ప్రేమ, కోరిక అనే అంశాల చుట్టూ తిరిగే ఈ సిరీస్‌ ట్రైలర్‌ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 19న ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి

టాలీవుడ్‌లో బీటౌన్‌ లేడీస్‌ కీ రోల్‌

అందుకే ఆమెను బి-గ్రేడ్‌ అనేది


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని