‘అర్జున్‌రెడ్డి’ సాంగ్‌తో అదరగొట్టేశారు..! 

ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి ప్రసారమయ్యే ‘ఢీ ఛాంపియన్స్‌’ డ్యాన్స్‌ షోకి ప్రేక్షకాదరణ మెండుగా ఉందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. 

Published : 17 Nov 2020 14:23 IST

హైదరాబాద్‌: ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి ప్రసారమయ్యే ‘ఢీ ఛాంపియన్స్‌’ డ్యాన్స్‌ షోకి ప్రేక్షకాదరణ మెండుగా ఉందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ షో క్వార్టర్‌ ఫైనల్స్‌ను పూర్తి చేసుకుని సెమీస్‌లోకి అడుగుపెట్టనుంది. శేఖర్‌ మాస్టర్‌, పూర్ణ, ప్రియమణి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ఈ షోలో సెమీస్‌లో భాగంగా పోటీదారులు తమ ప్రదర్శనలతో మెప్పించనున్నారు.  

సెమీఫైనల్స్‌ లెవల్‌-1లో పోటీదారులు పోటాపోటీగా తలపడనున్నారు. ‘దీవాళీ దీపాన్ని’ అంటూ ఓ కంటిస్టెంట్‌ మెప్పించనున్నారు. మరోవైపు అర్జున్‌ రెడ్డి చిత్రంలోని ‘తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని’ అనే బ్రేకప్‌ పాటకు  శేఖర్‌, ప్రియమణి ఫిదా కానున్నారు. మరోవైపు సుధీర్‌, ఆది, వర్షిణి, రష్మి తమ ఫన్నీ పంచులతో అలరించనున్నారు. ఓ వైపు హోరాహోరీ పోరు.. మరోవైపు టీమ్‌ లీడర్ల కామెడీ జోరుతో వచ్చేవారం ‘ఢీ ఛాంపియన్స్‌’ ప్రేక్షకులను మెప్పించనుంది. నవంబర్‌ 14న ప్రసారం కానున్న ‘ఢీ ఛాంపియన్స్‌’ ప్రోమో చూసేయండి.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని