Ponniyin Selvan: పొన్నియిన్‌ సెల్వన్‌: ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా?

విక్రమ్‌, కార్తి, జయం రవి కీలక పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) . రెండు భాగాలుగా

Published : 12 Sep 2022 12:43 IST

హైదరాబాద్‌: విక్రమ్‌, కార్తి, జయం రవి కీలక పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) . రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పార్ట్‌-1 సెప్టెంబరు 30న విడుదల కానుంది. చోళుల స్వర్ణయుగాన్ని ఈ చిత్రంతో సినీప్రియుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు మణిరత్నం. ఇది ఆయన కలల చిత్రం. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా రూపొందించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అదే విధంగా డిజిటల్‌ రైట్స్‌ను కూడా పెద్ద మొత్తానికే విక్రయమైనట్లు తెలుస్తోంది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1, 2’ ఓటీటీ రైట్స్‌ రూ.125 కోట్లకు  అమెజాన్‌ ప్రైమ్‌ కొనుగోలు చేయగా, డిజిటల్‌ రైట్స్‌ను సన్‌టీవీ దక్కించుకుంది. అయితే, ఎంతమొత్తానికి అన్నది తెలియరాలేదు. ఇక ఈ చిత్రంలో  ఐశ్వర్య రాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.  లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని